తమిళనాడులో నటుడు విజయ్(Vijay) ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన మరువకముందే ఆంధ్రప్రదేశ్లో మరో తొక్కిసలాట విషాద ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని దేవాలయంలో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిదిమంది మరణించిన విషయం తెలిసిందే. కాశీబుగ్గలోని
వెంకటేశ్వర స్వామి ఆలయం ముందుగా లోపలకి ప్రవేశించే ముందు గేట్ల వద్ద భారీగా భక్తులు చేరుకున్నారు. ఈ క్రమంలోనే గేట్ తెరవగానే మెట్లపై గందరగోళం జరిగింది. దీంతో మెట్లపై ఉన్న భక్తులు ఒకరిపై ఒకరు తోసుకుని కిందపడిపోయారు. అదే సమయంలో కిందపడిపోయిన వారిని తొక్కుకుంటూ ప్రజలు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో తొమ్మిదిమంది భక్తులు మరణించారు.
Read Also: Hyderabad Metro: మెట్రో రైళ్ల టైమింగ్స్ మార్పు

గుడి యాజమాన్యం తప్పిదమే ప్రమాదానికి కారణమా?
గుడి యాజమాన్యం చేసిన ఒక చిన్న తప్పిదం వల్లే ఈ ఘోరమైన ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కనీసం పోలీసులకు ఒక చిన్న సమాచారం సైతం ఇవ్వలేదు. అంతేకాక ఆలయానికి భారీ ఎత్తున భక్తులను అనుమతి ఇవ్వడమే ఆయల యాజమాన్యం చేసిన పెద్ద తప్పుగా తెలుస్తోంది. కార్తీక మాసంలో అది కూడా ఏకాదశి రోజు ఆలయాలకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని తెలిసి కూడా ఆలయ యాజమాన్యం పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
అంతేకాక వారి నుంచి అనుమతి కూడా తీసుకోలేదు. పోలీసుల భద్రత కొరవడడంతోనే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తున్నది. ఈ ఘటనలో పలువురు భక్తులు కూడా గాయపడ్డారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
దేశంలో ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నా పాలకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే అమాయకుల పాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇక్కడ ఆలయ యాజమాన్యం తప్పిదం స్పష్టంగా కనిపిస్తున్నది. పెద్ద సంఖ్య ప్రజలు వస్తున్నప్పుడు ముందస్తు అంచనాలు వేయడంలో విఫలం కావడమే ఇలాంటి ప్రమాదాలు తరచూ జరిగేందుకు కారణం అవుతున్నది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: