శ్రీకాకుళం జిల్లా(Srikakulam Stampede) కాశీబుగ్గలో ఘోర విషాదం చోటుచేసుకుంది. స్థానిక శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీతో పాటు ఇతర ఉన్నతాధికారులను సంప్రదించి, సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆమె ఆదేశించారు.
Read Also: Srikakulam Stampede: తొక్కిసలాట ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు

హోంమంత్రి మాట్లాడుతూ, “కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో(Srikakulam Stampede) పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన వార్త తీవ్రంగా కలిచివేసింది. అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ప్రభుత్వం వారిని అన్ని విధాలా ఆదుకుంటుంది,” అని తెలిపారు.
ప్రమాదం ఎలా జరిగింది?
హోంమంత్రి అనిత(Home Minister Anita) వివరాల ప్రకారం, ఈ ఆలయం మొదటి అంతస్తులో ఉండటంతో భక్తులు సుమారు 20 మెట్లు ఎక్కి పైకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మెట్ల రెయిలింగ్ ఒక్కసారిగా విరిగిపోవడంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయి తొక్కిసలాట జరిగింది. సాధారణంగా ఈ ఆలయానికి ప్రతి వారం 1,500 నుండి 2,000 మంది భక్తులు వస్తారని తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నారని ఆమె దుఃఖం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని హోంమంత్రి ఆదేశించారు. గాయపడిన భక్తుల పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఈ దుర్ఘటనతో కాశీబుగ్గ ప్రాంతంలో విషాదం అలుముకుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: