📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Srikakulam Crime: చిన్న వివాదం… ప్రాణం తీసింది!

Author Icon By Saritha
Updated: March 21, 2026 • 10:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Srikakulam Crime: శ్రీకాకుళం జిల్లా టిడిపి కార్యాలయ ఉద్యోగి మృతి, చిన్న వివాదం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పరిచయమే లేని ఇద్దరు యువకుల మధ్య అనవసరంగా మొదలైన గొడవ తోపులాటకు దారితీసి ఒకరి మరణానికి కారణమైంది. ఉగాది రోజు అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో శ్రీకాకుళం నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తోన్న మండల వీధికి చెందిన గొర్లె మోహనరావు (26) అనే యువకుడు మృతి చెందాడు.

మోహనరావు గురువారం నరసన్న పేటలో జరిగిన పార్టీ సమావేశానికి వెళ్లి రాత్రి పొద్దు పోయాక తిరిగి వచ్చాడు. ఇంటికి వెళ్లే క్రమంలో ఉమెన్స్ కళాశాల ఎదురుగా మండల వీధికి వెళ్లే రోడ్డులో తన మేనల్లుడు హరీష్ మహాలక్ష్మీనగర్ కాలనీకి చెందిన కొందరు యువకులతో కలిసి ఉండటాన్ని గమనించి వారి వద్దకు వెళ్లాడు. మేనల్లుడిని పిలిచి అంత రాత్రి వరకు మహాలక్ష్మీనగర్ యువకులతో ఎందుకు ఉన్నావంటూ మందలించినట్లు పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం తెలుస్తోంది.

Read Also : TDP : టీడీపీలో విషాదం.. సీనియర్ నేత కన్నుమూత

Srikakulam Crime: A minor dispute took a life!

Srikakulam Crime: తోపులాటలో ప్రాణం పోయింది.

మోహన రావు మందలింపులను విన్న గుంపులోని గడ్డి మనోహర్ అలియాస్ మనోజ్ అనే యువకుడు కల్పించుకుని మహాలక్ష్మినగర్ యువకులను ఎందుకు నిందిస్తున్నావంటూ నిలదీశాడు. దాంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి తోపులాటకు దారి తీసింది. ఆ క్రమంలో బైక్ మీద ఉన్న మోహనరావును మనోజ్ బలంగా నెట్టడంతో కింద వడిపోయిన బాధితుడు తలకు బలమైన గాయమైంది. తెలుసుకుని అక్కడికి చేరుకున్న మోహనరావు కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే రిమ్స్ ఆసుపత్రి కి తరలించి చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది.

మనోజ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మోహనరావు మరణించినట్లు ప్రకటించారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం సంఘటన స్థలంలో యువకుల సమూహం ఉండగా పోలీసులు మాత్రం తోపులాట జరిగినప్పుడు మోహనరావు, మనోజ్ ఇద్దరే ఉన్నారని చెబుతున్నారు. మోహన్ మృతిని వైద్యులు ధ్రువీకరించడంతో ఒకటో పట్టణ పోలీసులు నిందితుడు మనోజ్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. తలకు బలమైన గాయం కావడం వల్లే మోహనరావు మృతి చెందినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. రాత్రి 10.30 నుంచి 12.30 మధ్యలో జరిగిన ఈ ఘటన ఊహించని విధంగా జరిగిందని పోలీసులు చెబుతున్నారు. వివాదం ఎందుకు తలెత్తిందన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Andhra Pradesh Gorle Mohan Rao Srikakulam Crime Srikakulam Police Case TDP Office Employee Death

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.