AP Govt Advisor: మాజీ కార్టూనిస్ట్ పోచంపల్లి శ్రీధర్ రావుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక పదవిని కట్టబెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా (సమాచార ప్రచార విభాగం) ఆయనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామల రావు అధికారిక జీవోను విడుదల చేశారు.
Read Also: AU Students Protest: ఆంధ్ర యూనివర్సిటీ వద్ద మరోసారి ఉద్రిక్తత
రెండేళ్ల పదవీ కాలం – కేబినెట్ హోదాలో జీతభత్యాలు
శ్రీధర్ రావు ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారు. ఈ నియామకం ద్వారా ఆయనకు కేబినెట్ మంత్రి స్థాయి హోదా లభించింది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం ఆయనకు జీతభత్యాలు, ఇతర అలవెన్సులను కల్పించనుంది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడంలో ఆయన అనుభవం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. శ్రీధర్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నారు. రాజకీయ, సామాజిక అంశాలపై తన కార్టూన్లతో ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్న ఆయనకు ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుగా అవకాశం లభించడం విశేషం.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: