📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: Guntakal: రైళ్లలో ఆకస్మిక తనిఖీలు ఒక్క రోజే రూ.కోటికి పైగా ఆదాయం

Author Icon By Rajitha
Updated: October 15, 2025 • 12:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Guntakal గుంతకల్లు రైల్వే : ప్రస్తుత దీపావళి, (Diwali) ఛాత్ పండుగల సీజన్లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో టిక్కెట్లు లేకుండా/సరైన టిక్కెట్లు లేని ప్రయాణికుల నుంచి రికార్డు స్థాయిలో దక్షిణ మధ్య రైల్వే కోటి రూపాయలకు పైగా అపరాధ రుసుము వసూలు చేసి రికార్డు నెలకొల్పింది. దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఇతి పాండే ఆదేశాల మేరకు మంగళవారం రైల్వేజోన్ వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు జరిగాయి. ఈ ప్రత్యేక టికెట్ తనిఖీలలో జోన్ ఒకే రోజు అత్యధికంగా రూ.1.08 కోట్ల రూపాయలను రైల్వే జోన్ సాధించింది. టికెట్ లేని ప్రయాణం లేదా అనధికారికంగా ప్రయాణించిన ప్రయాణీకుల నుంచి మొత్తం 16,105 కేసులను నమోదు చేసి, ఆ మొత్తాన్ని వసూలు చేయబడ్డాయి. మంగళవారం ప్రత్యేక స్క్వాడ్ బృందాలు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో దక్షిణ మధ్య రైల్వే జోన్ చరిత్రలో ఒకే రోజు ఆదాయం కోటిరూపాయల మైలురాయిని దాటడం ఇదే ప్రథమం.

AP: డిజిపి నిద్రపోతున్నారా? రాష్ట్ర పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

Guntakal

భారతీయ రైల్వే అన్నిజోన్ల కంటే మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో ఒక కోటి, ఎనిమిది లక్షల రూపాయలను వసూలు చేయడం రికార్డు. Guntakal ఈ తనిఖీలలో డివిజన్ల వారిగా వసూలు చేసిన మొత్తం వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ (vijayawada) డివిజన్లో అత్యధికంగా రూ.36.91 లక్షలు, గుంతకల్లు డివిజన్ రూ.28 లక్షలు, సికింద్రాబాద్ డివిజన్ రూ.27.9 లక్షలు, గుంటూరు డివిజన్ రూ.6.46 లక్షలు, హైదరాబాద్ డివిజన్ రూ.4.6 లక్షలు, నాందేడ్ డివిజన్ రూ.4.08 లక్షలు వసూలు చేశారు.

ఆకస్మిక తనిఖీలలో ఒక్క రోజే ఎంత ఆదాయం ఏర్పడ్డింది?
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఒక్క రోజే రూ.1.08 కోట్ల పైగా ఆదాయం వసూలు చేసింది.

ఈ తనిఖీలలో ఎన్ని కేసులు నమోదు అయ్యాయి?
16,105 కేసులు నమోదు చేయబడ్డాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

latest news railway fines railway ticket inspection Southern Central Railway surprise inspections Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.