రాజమండ్రి, కొవ్వూరు రైల్వే స్టేషన్లలో 28.27 కోట్లుకు టెండర్లు
South Central Railway: రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలను (Godavari Pushkarala) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తలపెట్టారు. దీనికి ముందస్తుగా రైల్వే శాఖ పుష్కరాలకు ప్రయాణికుల అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రణాళికలు రూపొందించింది. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న పుష్కరాలకు రైల్వే అధికారులు రూ.28.87 కోట్లతో పనులు చేపట్టేందుకు ఉత్తర్వులు జారీచేసింది.
Read Also: Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలపై డీజీపీ సమీక్ష
మౌళిక సదుపాయాల కల్పన
విజయవాడ-రాజమండ్రి రైల్వే సెక్షన్ ఇంజనీరింగ్ అధికారులు టెండర్లు పిలిచారు. మార్చి 20న టెండర్లకు చివరి గడువుగా నిర్ణయించారు. కొవ్వూరు, గోదావరి, రాజమండ్రి రైల్వే స్టేషన్లలో వివిధ ప్లాట్ఫారాలలో ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు నిధులను కేటాయించారు. ప్రధానంగా అదనపు బుకింగ్ కౌంటర్లు, టాయిలెట్లు, తాగునీరు, స్టేషన్లో యార్డుల అభివృద్ధి, శాశ్వత, తాత్కాలిక ప్రాతిపదికన మౌళిక సదుపాయాలు కల్పించేందుకు పనులు చేపడతారు. ఈ పనులన్నీ 2027 ఏప్రిల్ నాటికి పనులు పూర్తి చేసేలా ప్లాన్ సిద్ధం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: