📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

South Central Railway: తెలుగు రాష్ట్రాల మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్

Author Icon By Saritha
Updated: January 23, 2026 • 11:44 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ (తార్నాక) : తెలుగు రైల్వే ప్రయాణికులకు శుభవార్తను అందించింది. దక్షిణ మధ్యరైల్యే. (South Central Railway) రైల్వే ప్రయాణికులకు మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు తెలుగు రాష్ట్రాలకు అందుబాటులోకి రానుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ అమృత్ భారత్ రైలు తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించనుంది. ఈ రైలును జనవరి 23 న కేరళలోని తిరువనంతపురం నుంచి ఈ రైలును ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (Minister Narendra Modi) ప్రారంభించనున్నారు. ఇప్పటికి చర్లపల్లి ముజఫర్ పూర్ ( భీహార్) మధ్య ఒక అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ నడుస్తోంది. తిరువనంతపురం – చర్లపల్లి మధ్య నడిచే ఈ రైలు తెలంగాణకు కేటాయించిన రెండో అమృత్ భారత్ రైలు. ఈ రెలు ప్రతి మంగళవారం చర్లపల్లి నుంచి ఉదయం 7.15కు బయలు దేరి బుధవారం మధ్యాహ్నం 2.45 గంటలకు చేరుతుంది. తిరిగి బుధవారం సాయంత్రం 5.30 గంటలకు బయలు దేరి తర్వాత రోజు రాత్రి 11.30 గంటలకు చర్లపల్లికి చేరకుంటుంది.

Read also: AP: వైద్యవిద్యపరీక్షల నిర్వహణలో పారదర్శకత

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు

ఆధునిక సదుపాయాలతో, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా ఈ రైలును రూపొందించారు. (South Central Railway) మధ్యతరగతి, సాధారణ ప్రయాణికులకు అందుబాటు ధరల్లో వేగవంతమైన ప్రయాణాన్ని అందించడం ఈ రైలు ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల ప్రారంభంతో తెలుగు రాష్ట్రాల్లో రైల్వే కనెక్టివిటీ మరింత మెరుగవుతుందని, ప్రయాణ సమయం తగ్గడంతో పాటు భద్రత, సౌకర్యాలు పెరుగుతాయని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలు తెలంగాణలోని పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగనుంది. ముఖ్యంగా నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, ఖమ్మం, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట తదితర స్టేషన్లలో ఈ రైలు నిలుస్తుందని అధికారులు తెలిపారు. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రయాణం మరింత సులభం కానుందని, సాధారణ ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన రైల్వే సేవలు అందుబాటులోకి వస్తాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Amrit Bharat Express hyderabad Indian Railways Latest News in Telugu South Central Railway Tarnaka Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.