గుంటూరు: జాతీయస్థాయిలో జరుగే జనగణనతో పాటే సమగ్ర కులగణన జరుపుటకు సంబంధించిన విధి విధానాలతో పాటు, చట్టసభలలో ఓబీసీలకు జనాభా దామాషా మేరకు రిజర్వేషన్ల (Reservations) కై కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాల్సిందిగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు (Shankar Rao) తెలియజేశారు. ఈరోజు వారు మేరకు పలువురు బీసీ నాయకులతో కలిసి, బిజెపి రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సమక్షంలో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్ గంగారాం అహిర్ కు విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. అనాదిగా రాజ్ సామాజిక అన్యాయానికి ఆర్థిక దోపిడీకి గురైన ఓబీసీల సాధికారితకు పలు డిమాండ్ల అమలుకై కేంద్రానికి సిఫారసు చేయాల్సిందిగా అందులో కోరారు.
బీసీ మహిళకు సబ్ కోటా
బీసీ మహిళకు సబ్ కోటానిస్తూ, మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణ చేసి అమలు చేయాలని కోరారు. ప్రపంచీకరణ ఆర్థిక సరళీకరణ విధానాల నేపథ్యంలో ప్రభుత్వ రంగం కంటే ప్రైవేటు రంగమే అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్న క్రమంలో, ఓబీసీ (OBC) లకు ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లను అమలు జరపాలని కోరారు. ఇంకా కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, ఓబిసి సబ్ ప్లాన్ రూపొందించి, ఆ మేరకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని వారు కోరారు. ఇంకా వారు క్రిమిలేయర్ ఎత్తేయాలని, ఓబీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కేటాయించాలని, ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని, మండల సిఫారసులన్నింటినీ సక్రమంగా అమలు పరచాలని కోరారు. ఈ డిమాండ్లన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ఒప్పించుటకు తమ పరపతిని వినియోగించాలని శంకరరావు (Shankar Rao) కమిషన్ చైర్మన్ గంగా రామ్ కు విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన అధ్యక్షులు కుమార క్రాంతి కుమార్, ఆమోదించి, అమలు జరిపేలా రాష్ట్ర నాయకులు కేసన కోటేశ్వరరావు, విష్ణు, పలువురు బీసీ నాయకులు పాల్గొని చైర్మన్ గంగారాము ఘనంగా హంసరాజ్ సత్కరించారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: Satyakumar Yadav: ఆహార పదార్థాలు, మందుల నాణ్యతపై నిఘా పెంచాలి – మంత్రి సత్యకుమార్ యాదవ్