ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు వేదికైంది. ఈ సమావేశంలో మొత్తం 21 అంశాలపై చర్చించగా, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం దిశగా అనేక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన “ఆటో డ్రైవర్ల సేవలో” పథకానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Pawan Kalyan: ఉత్తరాంధ్ర వరద పరిస్థితిపై డిప్యూటీ సీఎం సమీక్ష
ఈ పథకం కింద ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రూ.15000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. విజయవాడలో సింగ్ నగర్లో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ పథకం కింద సుమారుగా 2 లక్షల 90 వేల మంది లబ్ధిదారులకు రూ.435 కోట్ల మేరకు అకౌంట్లో డబ్బులు జమ చేయనున్నారు. ఆటో డ్రైవర్ల (Auto drivers) సేవలో పథకంతో పాటుగా మరికొన్ని ప్రతిపాదనలకు కూడా ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ పాలసీ 2024-29కి సంబంధించిన అనుబంధ ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఏపీ కేబినెట్ పచ్చజెండా ఊపింది
అలాగే అమృత్ పథకం 2.0 పనులకు, జలవనరుల శాఖకు సంబంధించి పనులకు, కారవాన్ పర్యాటకానికి ఏపీ కేబినెట్ పచ్చజెండా ఊపింది. అమరావతిలో చేపట్టిన వివిధ పనులను వేగంగా పూర్తి చేసేందుకు గానూ స్పెషల్ పర్పస్ వెహికల్ (Special Purpose Vehicle) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
అలాంటి సంస్థలకు భూములు కేటాయింపునకు సంబంధించిన ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు కుష్ఠు వ్యాధి పదం తొలగించేలా చట్టసవరణ చేయాలనే ప్రతిపాదనకు కూడా ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కార్మిక చట్టాల్లో సవరణలకు, విద్యుత్ శాఖ ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: