హైదరాబాద్ నుండి విశాఖపట్నం వరకు 52 సంవత్సరాలుగా నిరంతరం సేవలందిస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ తాజాగా మరో అరుదైన గౌరవాన్ని అందుకుంది. 2025 సంవత్సరానికి బెస్ట్ మెయింటేన్డ్ ట్రైన్ అవార్డు ఈ ట్రైన్కు లభించిందని, సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) అధికారికంగా ప్రకటించింది. 1974లో ప్రారంభమైనప్పటి నుండి ఈ రైలు తరాలుగా ప్రయాణికుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ‘1974 నుంచి ఇదొక ట్రైన్ కంటే ఓ గొప్ప ఎమోషన్. ఎన్నో జ్ఞాపకాలు సొంతం చేసుకుంది. ట్రైన్ నంబర్ 12728 సెలబ్రేషన్స్ గొప్పగా నిర్వహించాం’ అని (SCR) ట్వీట్ చేసింది.
Read Also: AP: నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు: పవన్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: