📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Savita: దుర్గమ్మ ఆశీస్సులతో అభివృద్ధి పథంలో రాష్ట్రం: మంత్రి సవిత

Author Icon By Sushmitha
Updated: September 29, 2025 • 2:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ: విజయవాడ కనక దుర్గమ్మ ఆశీస్సులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. రాష్ట్రం, విజయవాడ నగర ప్రజలపై దుర్గమ్మ చల్లని దీవెనలు ఎప్పుడూ ఉండాలని ఆమె ఆకాంక్షించారు. దేవీ నవరాత్రుల్లో భాగంగా ఆదివారం ఏడో రోజు ఇంద్రకీలాద్రిపై వెలసిన కనక దుర్గమ్మవారికి రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణితో కలిసి మంత్రి సవిత పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అర్చకులు వేదాశీర్వచనంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు.

Read Also: Vijay: నటుడు విజయ్ కి బాంబు బెదిరింపులు

ఉచిత దర్శనం, భక్తుల సౌకర్యాలు

మంత్రి సవిత(Savita) మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, లక్షలాదిగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు. ఆదివారం నుంచి దసరా ఉత్సవాలు(Dussehra celebrations) ముగిసేవరకు భక్తులకు ఉచిత దర్శనం కల్పిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. సుదూరం నుంచి మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారని, అమ్మవారి దర్శనానికి స్త్రీ శక్తి పథకం ఎంతో దోహదం చేస్తోందని మంత్రి తెలిపారు. కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం మంత్రి సవిత క్యూ లైన్లలో ఉన్న భక్తులతో మాట్లాడి, ఏర్పాట్లపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లన్నీ బాగున్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.

వైద్య శిబిరాల పరిశీలన, ఆశీర్వచనం

కొండపై ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాలను కూడా మంత్రి సవిత పరిశీలించారు. అందుబాటులో ఉన్న మందుల గురించి అడిగి తెలుసుకున్నారు. భక్తుల కోసం అహర్నిశలు కష్టపడుతున్న వైద్య ఆరోగ్య సిబ్బందిని మంత్రి ప్రశంసించారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన మంత్రి సవితకు ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. ఏడో రోజు ఆదివారం అమ్మవారు శ్రీమహాచండీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

మంత్రి సవిత దుర్గమ్మకు ఎప్పుడు పట్టువస్త్రాలు సమర్పించారు?

దేవీ నవరాత్రుల్లో భాగంగా ఆదివారం ఏడో రోజు పట్టువస్త్రాలు సమర్పించారు.

ఏ పథకం మహిళలు ఆలయానికి రావడానికి దోహదపడుతోందని మంత్రి అన్నారు?

ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించే ‘స్త్రీ శక్తి పథకం’ మహిళలు ఆలయానికి రావడానికి దోహదపడుతోందని మంత్రి అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Andhra Pradesh Dasara Utsavam free bus travel. Google News in Telugu Kanaka Durga Temple Latest News in Telugu Minister S. Savita Telugu News Today Vijayawada

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.