📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Sathyakumar: సదరం సర్టిఫికెట్ జారీకి లంచండాక్టరుకు ఉద్వాసన

Author Icon By Saritha
Updated: October 10, 2025 • 1:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సదరం సర్టిఫికెట్ జారీకి లంచం డిమాండ్ చేసిన వైద్యుడిపై చర్యలు

విజయవాడ : సదరం సర్టిఫికెట్ జారీకి లంచం అడిగిన ఒక వైద్యున్ని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు ఉద్యోగం నుంచి తొలిగించారు. మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఒక యువతికి సదరం సర్టిఫికేట్ కోసం ఆమె తండ్రి నుంచి లంచం డిమాండ్ చేసిన ఒక ప్రభుత్వ వైద్యుడి పై ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్వయంగా ఏసీబీ విచారణ ఆదేశించారు. అనంతరం ఆ నివేదికపై మళ్ళీ మంత్రి(sathyakumar)విచారింంచారు. ఆపై వైద్యున్ని తక్షణమే విధుల నుండి తొలగించాలని మంత్రి గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 2022లో జరిగిన ఈ సంఘటన జరిగింది. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఒక బాలికకు సదరం సర్టిఫికెట్ జారీ చేయడానికి వైయస్సార్ కడప జిల్లా ప్రభుత్వ సర్వజనాసుపత్రి (జిజిహెచ్)లో పిల్లల మానసిక వైద్య నిపుణుడిగా పనిచేస్తున్న ఒక డాక్టరు ఆ బాలిక తండ్రి నుంచి రూ.10 వేలు లంచాన్ని అడిగారు. అంత ఇచ్చుకోలేనని, రూ.5 వేల వరకు ఇవ్వగలనని తండ్రి ప్రాధేయపడ్డారు.

Read also: ఓటమి పై టీమిండియా కెప్టెన్ ఏమన్నారంటే?

మానసిక సమస్యలతో బాధపడుతున్న బాలిక కోసం లంచం అడిగిన వైద్యుడి కేసు

వైద్యుడు అంగీకరించకపోవడంతో దిక్కుతోచని ఆ తండ్రి చివరిగా రూ.7వేలు ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. ఆయినా రూ.10వేలు ఇవ్వాల్సిందేనని, అది కూడా రెండ్రోజుల్లో ఏర్పాటు చేయాలని ఆ వైద్యుడు గడువు పెట్టాడు. గతిలేని పరిస్థితుల్లో ఆ తండ్రి జిల్లా కలెక్టర్ నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని పరిశీలించాలని అధికారులు ఎసిబిను(sathyakumar)కోరగా, వారు విచారణ చేపట్టారు. సాక్షుల వాంగ్మూలాలు, లభించిన పత్రాల ఆధారంగా లంచం ఆరోపణ వాస్తవమేనని ఏప్రిల్ 2025లో ఎసిబి తన నివేదికలో స్పష్టం చేసింది. సదరు వైద్యుడు కాంట్రాక్ట్ సేవలందిస్తున్నందున అతనిపై తక్షణమే చర్యలు చేపట్టాలని సిఫారసు చేసింది. మానసిక సమస్యలతో సతమతమవుతున్న బాలిక దుస్థితిని గమనించకుండా తన స్వార్జన కోసం అడ్డదారులు తొక్కాలనుకున్న ఆ వైద్యుడి వైఖరిని తీవ్రంగా పరిగణించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ అతనికి తక్షణమే ఉద్వాసన పలకాలని ఆదేశాలు జారీ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

AndhraPradeshHealthcare APHealthMinister GovernmentHospital latest news SadaremCertificate Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.