భారతీయ ఎఫ్ఎంసీజీ రంగంలో కీలకమైన సబ్బుల మార్కెట్లో విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్ సంస్థకు చెందిన సంతూర్ (Santoor) బ్రాండ్ చరిత్ర సృష్టించింది. ఎన్నేళ్లుగా ఈ విభాగంలో అగ్రస్థానంలో కొనసాగిన లైఫ్బాయ్ను వెనక్కి నెట్టి, సంతూర్ (Santoor) తాజాగా నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. గత 12 నెలల కాలంలో సంతూర్ సబ్బుల అమ్మకాలు రూ. 2,850 కోట్లకు చేరుకోవడం విశేషం.
Read Also: Q Commerce: మెరుపు డెలివరీతో మారుతున్న ప్రజల జీవనశైలి
ఏపీపై దృష్టి
సంతూర్ విజయ ప్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించింది. 1990ల చివర్లో రాష్ట్రాలవారీగా విస్తరించాలని నిర్ణయించుకున్న విప్రో, తొలుత ఏపీపై దృష్టి సారించింది. ఇక్కడ విజయం సాధించిన తర్వాత తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్లకు విస్తరించింది. 2012 నాటికి రూ. 1,000 కోట్ల అమ్మకాల మార్కును దాటిన సంతూర్, 2018లో రూ. 2,000 కోట్లతో లక్స్ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరింది.
తాజాగా రూ. 2,850 కోట్ల అమ్మకాలతో దేశంలోనే నంబర్ 1 సోప్గా అవతరించింది.ఈ మైలురాయిపై విప్రో కన్స్యూమర్ కేర్ సీఈఓ వినీత్ అగర్వాల్ మాట్లాడుతూ, “వినియోగదారులను లోతుగా అర్థం చేసుకోవడం, నాణ్యతలో రాజీ పడకపోవడం వల్లే ఈ విజయం సాధ్యమైంది. మా బృందాల అంకితభావం, భాగస్వాముల సహకారం మరువలేనిది” అని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: