📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

New Telugu: Sankranti: సంక్రాంతి పండుగ కష్టాలు షురూ.. టికెట్లు ఆలస్యం చేస్తే క్లోజ్!

Author Icon By Rajitha
Updated: November 23, 2025 • 1:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సంక్రాంతి సమయం దగ్గరపడుతుండటంతో తెలుగు రాష్ట్రాలకు వెళ్లే వారి ప్రయాణ ఇబ్బందులు ముందుగానే మొదలయ్యాయి. హైదరాబాద్‌లో ఉంటూ స్వగ్రామాలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, కుటుంబాలు ఇప్పటికే రవాణా సౌకర్యాల కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా పండగకు చాలా రోజులు ఉన్నా, రైళ్లు బస్సులు పూర్తిగా ఫుల్ కావడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

Read also: Minister Jupally: కేసీఆర్ అప్పులు తెలంగాణ ఆర్థిక బరువుకు కారణం

The hardships of the Sankranti festival have begun

కొన్ని తేదీల్లో ‘రిగ్రెట్’ వరకు చేరడం

సాధారణంగా సంక్రాంతి (sankranti) సమయానికి ఏపీ వైపు భారీగా ప్రజలు తరలుతుంటారు. కానీ ఈసారి పరిస్థితి ఇంకా కఠినంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గోదావరి, గరీబ్‌రథ్, చార్మినార్, సింహపురి వంటి ప్రధాన రైళ్లలో రిజర్వేషన్లు మొదటి రోజుల్లోనే పూర్తిగా నిండిపోయాయి. వెయిటింగ్ లిస్ట్ వందల్లోకి వెళ్లి, కొన్ని తేదీల్లో ‘రిగ్రెట్’ వరకు చేరడం ప్రయాణ అవకాశాలను పూర్తిగా తగ్గిస్తోంది. బస్సుల్లో కూడా ఇదే పరిస్థితి. ఏపీఎస్‌ఆర్టీసీ సీట్లు ఎక్కువ భాగం బుక్ అయిపోయి, టీజీఎస్‌ఆర్టీసీలో మాత్రమే కొంత మేరకు సీట్లు కనిపిస్తున్నాయి.

మరోవైపు విమాన టికెట్ల ధరలు విపరీతంగా పెరిగాయి. సాధారణ రోజుల్లో ఉండే రేటుకంటే కొన్ని తేదీల్లో 50–100 శాతం వరకు ఛార్జీలు పెరిగాయి. జనవరి 9 నుండి 13 వరకు డిమాండ్ పెరగడం, కానీ ఇప్పటి వరకు ప్రత్యేక రైళ్లు ప్రత్యేక బస్సుల ప్రకటన లేకపోవడం ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది. ప్రయాణాలు ఎలా ప్లాన్ చేయాలా అనే ఆలోచనలో ప్రయాణికులు పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

latest news Sankranti Telugu News train booking travel rush

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.