📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి

Andhra Pradesh politics : నియంత పాలనకు నిదర్శనం ఇదేనా? ఏపీ రాజకీయ వేధింపులపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

Author Icon By Sai Kiran
Updated: December 30, 2025 • 5:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Andhra Pradesh politics : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేధింపులు హద్దులు దాటిపోయాయని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. పార్టీ లీగల్ సెల్ నేతలతో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో ఆయన ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు.

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించడాన్ని ఓర్వలేకే పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని సజ్జల మండిపడ్డారు. ఇంతకంటే నియంత పాలనకు మరో నిదర్శనం ఉండదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ పూర్తిగా హద్దులు దాటుతూ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

కూటమి ప్రభుత్వానికి వంత (Andhra Pradesh politics) పాడుతున్న పోలీసు వ్యవస్థ చర్యలను చట్టపరంగా ధీటుగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. చట్టాన్ని అతిక్రమిస్తూ వ్యవహరిస్తున్న అధికారులపై ప్రైవేట్ కేసులు నమోదు చేయాలని సూచించారు. ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’కు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తున్న పార్టీ లీగల్ సెల్‌ను ఆయన అభినందించారు.

Read Also:  TG: ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు

చంద్రబాబు, బాలకృష్ణ ఫ్లెక్సీలకు పొట్టేళ్ల తలలతో హారం వేసిన ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని సజ్జల ప్రశ్నించారు. ఇటీవల ఒకరిపై రాజద్రోహం కేసు పెట్టడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. ప్రజల హక్కుల కోసం పోరాడిన కమ్యూనిస్టు నాయకుడిపై పీడీ యాక్ట్ పెట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరింత పట్టుదలతో పార్టీని నడుపుతూ ప్రతి ప్రజా సమస్యపై ముందుండి పోరాడుతున్నారని సజ్జల తెలిపారు. కూటమి ప్రభుత్వ దమనకాండను ఎదుర్కొనేందుకు వైసీపీ శ్రేణులు పోరాట పటిమతో ముందుకు సాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh politics AP police actions Breaking News in Telugu Chandrababu Naidu criticism Google News in Telugu Indian political news Latest News in Telugu Lokesh Nara news political harassment AP Sajjala Ramakrishna Reddy Telugu News YS Jagan birthday case YSR Congress legal cell YSRCP news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.