మావోయిస్టు (Maoist) అగ్రనేత హిడ్మా మృతిపై ఇంకా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తన రక్షణ దళ సభ్యులతో కలిసి ఏపీ ఏజెన్సీ లోకి ప్రదేశించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ముందుగా కొంతమంది సాయుధులు ఏపీలోని (Ap) కొన్ని ప్రాంతాలకు చేరుకుని షెల్టర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కొంతకాలం షెల్టర్ (Shelter) తీసుకున్న తర్వాత తిరిగి దండకారుణ్యం లేదా ఓడిస్సాలోకి ప్రవేశించాలని హిడ్మా బృందం భావించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం ముందుగానే లీక్ కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హిడ్మా అనుచరులను ముందుగానే అదుపులోకి తీసుకుని హిడ్మా ఆచూకీ కనిపెట్టినట్లు తెలుస్తోంది. లొంగిపోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలోనే ఆయన ఎన్ కౌంటర్ అయినట్లు తెలుస్తోంది.
Read Also: AI: విద్యార్థులకు AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం!
మావోయిస్టులకు కోర్టు రిమాండ్
ఇప్పటికే పలువురు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని కోర్టులో ప్రవేశపెట్టగా వారికి కోర్టు రిమాండ్ విధించింది. అదే సమయంలో కోనసీమ జిల్లాలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా అనుచరుడిగా భావిస్తున్న మడివి సరోజ్ ను పోలీసులు రావులపాలెంలో అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. అతడిని అరెస్టు చేసి, రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం. మారేడుమిల్లి సమీపంలో నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో హిడ్మా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హిడ్మా అనుచరుడిగా ఉన్న మడివి సరోజ్ రావులపాలెంలో తలదాచుకున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశాయి.
అత్యంత కీలక సభ్యునిగా సరోజ్ మండ్వి
హిడా సన్నిహితుడు సరోజ్ మండ్వి హిడ్మా (Sagar Kavach) రక్షణదళంలో అత్యంత కీలక సభ్యునిగా వ్యవహరించారు. హిడ్మాతో ఛత్తీస్ గఢ్ పలు ఎన్ కౌంటర్ లలో సరోజ్ మండ్వి పాల్గొన్నాడు. సరోజ్ మండ్వి గత కొన్నిరోజులుగా సఖినేటిపల్లి సమీపంలో ఆక్వా చెరువు వద్ద పనిచేస్తున్నాడు. ఛత్తీస్ గడ్ సుక్మా జిల్లాకు చెందిన సరోజ్ మండ్వి రావులపాలెంలో సరోజ్ మండ్విను అదుపులోకి తీసుకున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: