📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

S. Savitha: వడ్డెర, రజక,మత్స్యకారులను రిజర్వేషన్ కల్పించాలన్న మంత్రి ఎస్. సవిత

Author Icon By Saritha
Updated: March 6, 2026 • 12:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

S. Savitha: వెనుబడిన సామాజిక వర్గా అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. వడ్డెర, రజక, మత్స్యకారులను (Fishermen) ఎస్సి, ఎస్టిలలో చేర్చాలన్న ప్రతిపాదనపై తగినరీతిలో చర్యలు తీసుకుంటామన్నారు. అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ వడ్డెర, రజక, మత్స్యకారులను ఎస్సి, ఎస్ట్రలలో చేర్చాలన్న ప్రతిపాదన కేంద్రం వద్ద పెండింగ్లో ఉందన్నారు. ఈ అంశంలో కేంద్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో రిజర్వేషన్ల మార్పు ప్రతిపాదన ఏదీ లేదన్నారు.

Read Also: Srikalahasti Temple: కొత్త ఇఒగా వెంకటేశు బాధ్యతల స్వీకరణ

S. Savitha: Minister wants reservation for Vaddera, Rajaka and fishermen

కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలు

బిసిల్లో అత్యంత వెనుకబడిన వర్గాలుగా ఉన్న వడ్డెర, రజక, మత్స్యకారులను ఎస్సి, ఎస్టిలలో చేర్చాలన్న ప్రతిపాదన ఎన్నో ఏళ్లుగా కేంద్రం వద్ద ఉందని కానీ పాలకులు ఎన్నికలప్పుడు హామీలు ఇస్తున్నారని తరువాత విస్మరిస్తున్నారని సభ్యులు మంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళారు. కేంద్రంలో టిడిపి కీలకంగా ఉందని అందువల్ల కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ మూడు కులాలను గతంలో హామీ ఇచ్చినట్టుగా ఎసిసి, లేదా ఎసిటి కేటగిరిలోకి మార్చేలా కూటమి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. గతంలో వైసిపి ప్రభుత్వం కూడా అధికారులతో కమిటీలు వేసిందన్నారు. 1973లో వడ్డెర కులస్తులను ఎస్టలుగా పరిగణించాలని ప్రతిపాదనతో అప్పటి ప్రభుత్వం కేంద్రానికి పంపినా ఇప్పటి వరకు ఆమోదం పొందలేదని చెప్పారు. గత 50 ఏళ్లకాలంలో పలు మార్లు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారని గుర్తు చేశారు.

బిసిల సంక్షేమానికి ప్రభుత్వ ప్రాధాన్యత

కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఎన్నికలలో హామీ ఇచ్చినట్టుగా ఈ మూడు కులాల వారికి న్యాయం చేయాలన్నారు. మంత్రి సవిత సమాధానం చెబుతూ 2014-19లో వడ్డెర్లకు, రజకులకు, మత్స్యకారులతో పాటు ఇతర కులాల వారికి అధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ప్రతి బిసి కుటుంబం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్నారు. గతంలో ఆదరణ, ఆదరణ2 పథకాలను ప్రారంభించిన మనత సీఎం చంద్రబాబుదేనని తెలిపారు. త్వరలో ప్రారంభించబోయే ఆదరణ 3.0లో వడ్డెర్లకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. వడ్డెర్లకు మైనింగ్ లీజు కేటాయింపుల్లో 15 శాతం రిజర్వేషన్లు, సీనరేజీలో 50 శాతం మినహాయింపు ఇచ్చే ఆలోచన ఉందన్నారు. సముద్రంలో చేపల వేట నిషేధం కాలంలో మత్స్యకారులకు (పల్లెకారులు) ఇచ్చే ఆర్థిక సాయం రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచామన్నారు. రాబోయే ఆదరణ 3.0 పథకంలో రజకులకు వాషింగ్ మిషన్లు, ఆధునిక పరికరాలు అంద జేయబోతున్నామన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP Assembly News BC Welfare AP Minister Savitha SC ST Status Proposals

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.