మొలకలచెరువు (Mulakalacheruvu) కల్తీ మద్యం వ్యవహారంపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ అంశంపై వైసీపీ నేత రోజా Roja చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ (panchumarthi Anuradha) తీవ్రంగా స్పందించారు. “తమ హయాంలో జరిగిన పాపాల్ని ఇప్పుడు మాపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొలకలచెరువులో బయటపడిన కల్తీ మద్యం వ్యవహారం వైసీపీ పాలనలోనే మొదలైంది. ఆ అవకతవకల్ని కూటమి ప్రభుత్వం బయట పెట్టింది,” అని ఆమె స్పష్టం చేశారు.
Polythene: పాలిథిన్ వాడకంపై జరిమానా విధించాలి: రఘు రామకృష్ణరాజు

Panchumarthi Anuradha Fire
రోజా Roja పై ఘాటు విమర్శలు చేస్తూ, “మాట మీద నిలకడ లేకే ఇప్పుడు ‘తైతక్కల రోజా’ అనే పేరు వచ్చింది. మీ పాలనలో ప్రజల రక్తం పీల్చే స్థాయికి నాసిరకం మద్యం వ్యాపారం పెరిగింది. ఆ పాపాల మచ్చలు ఇంకా మిగిలే ఉన్నాయి,” అని అనురాధ దుయ్యబట్టారు. అదే సమయంలో, “తప్పు మీదే ఉన్నప్పుడు మాపై ఆరోపణలు చేయడం మీకు అలవాటైపోయింది. వివేకా హత్యకేసులో సీబీఐ విచారణకు జగన్ (jagan) ఎందుకు భయపడ్డారో ముందు చెప్పండి. తర్వాత కల్తీ సారా కేసులో సీబీఐ విచారణ కోరండి,” అంటూ అనురాధ సవాల్ విసిరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: