20 దుంగలు స్వాధీనం: ఒకరి అరెస్టు
రాజంపేట : తమిళనాడు రాష్ట్రంలోని క్రిష్ణగిరి సెంట్రల్ జైలు లో కలిసిన నలుగురు నేరస్తులు ముఠాగా ఏర్పడి ఎర్రచందనం స్మగ్లింగ్ (Red sandalwood smuggling) చేసి చివరకు పుంగనూరులో పట్టుబడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. క్రిష్ణగిరి చెందిన మణివన్, తిరువన్నామలై కి చెందిన రవి, కర్ణాటక హుస్కోటకు చెందిన సయ్యద్ ఆరిఫ్, తమిళనాడు హోసూరు కు చెందిన సర్దార్ అనే నిందితులు కృష్ణగిరి జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో స్నేహితులయ్యారు.
శిక్ష ముగిసిన తర్వాత నలుగురు విడుదలైన ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ కు పథకం రచించారు. అనుకున్నది తడవుగా కడప జిల్లా రాజంపేట (Rajampet) అడవుల నుంచి 20 ఎర్రచందనం దుంగలను సేకరించారు. శనివారం వీటిని రవాణా చేసేందుకు ఒక ఇన్నోవా వాహనాన్ని ఏర్పాటు చేసుకుని, దుంగలను అందులో తరలించారు. అర్ధరాత్రి వేళ అక్రమ మార్గాల గుండా వాహనం ప్రయాణిస్తున్న తీరును పోలీసు నిఘా వర్గాలు గమనించాయి.
ప్రయాణిస్తున్న ఇద్దరు నిందితులు పరారయ్యారు
పలమనేరు డి.ఎస్.పి ప్రభాకర్ (Palamaneru DSP Prabhakar) ఆదేశాల మేరకు పుంగనూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడు, ఎస్సై హరి ప్రసాద్ సిబ్బంది కలసి ఈ వాహనాన్ని పుంగనూరు సుగాలి మిట్ట మార్గంలోని నేతిగుట్లపల్లి వద్ద అడ్డగించారు. అప్పటికే వాహనం ముందర రెండు ద్విచక్ర వాహనాల్లో మార్గం చూపుతూ ప్రయాణిస్తున్న ఇద్దరు నిందితులు పరారయ్యారు. కార ప్రయాణిస్తున్న మరో నిందితుడు కూడా పడా కాగా వాహనంతో పాటు సర్దార్ అనే నిందితుడు పోలీసులకు పట్టబడ్డాడు. ఇతనిని విచారించిన తర్వాత ముగ్గురు నిందితుల వివరాలు తెలిసాయి.
మొత్తం 20 ఎర్రచంద దుంగలను (20 red moon logs), వీరు ప్రయాణిస్తున్న వాహనా పోలీసులు స్వాధీనం చేసుకున్నా ఎర్రచందనం విలువ 34 లక్షల రూపాయల నిర్ధారించారు. తక్కిన ముగ్గురు నేరస్తు కూడా అదుపులో తీసుకున్నందుకు, బృందాలను ఏర్పాటు చేసినట్లు డిఎస్పి ప్రభాకర్ తెలిపారు. రాజంపేట అడవుల ను పుంగనూరు అడవుల (Punganur forests) వరకు పల్లె దారుల ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ గతంలో వాహనాలు పట్టుబడ్డాయి. పుంగనూ అడవులను అడ్డుగా పెట్టుకుని ఎర్రచందనాన్ని రాత్రికి రాత్రే చెన్నై హార్బర్ చేర్చేందుకు ఫక్కిలో నేరస్తులు చేస్తున్న విశ్వ ప్రయత్నాల పోలీసులు భగ్నం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: