- ఒకొక్కరికి రూ.6లక్షల జరిమానా
- తీర్పు వెల్లడించిన ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి
తిరుపతి: ఎర్రచందనం (Red Sandalwood) అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన ఇద్దరు స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష, ఒకొక్కరికి రూ. 6లక్షల చొప్పున జరిమానా విధిస్తూ ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి శ్రీ నరసింహమూర్తి సోమవారం తీర్పు నిచ్చారు. ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ హెడ్ శ్రీ ఎల్. సుబ్బారాయుడు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్సు ఎస్పీ శ్రీ పీ. శ్రీనివాస్ పర్యవేక్షణలో గతంలో నమోదయ్యి, కోర్టులో విచారణ దశలో ఉన్న కేసుల గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు.
ఇద్దరు స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష
పగడ్బందీగా సాక్ష్యాధారాలను నిరూపించి ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా క్రైమ్ నెంబరు 27/2016 కేసులో ఇద్దరు ముద్దాయిలు అరెస్టయ్యారు. వీరు తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన జె. దామోదరం, ఏ. హరిప్రసాద్ కాగా ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ చంద్రగిరి మండలం, పాండురంగవారి పల్లి ప్రాంతంలో పట్టుబడ్డారు. వీరి నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరు స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష తో పాటు రూ. 6లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. తదుపరి కోర్టు ఆదేశాలు మేరకు వీరిని నెల్లూరు సెంట్రల్ జైలులో అప్పగించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని శేషాచలం రిజర్వు ఫారెస్టులో అతి విలువైన సహజ సంపద అయిన ఎర్రచందనం చెట్లను నరికి అక్రమ రవాణా చేయడమే కాకుండా, అడవిలోకి అక్రమ ప్రవేశం చేసిన నేరస్తులకు కూడా ఇది ఒక హెచ్చరికగా పరిగణించబడుతుందని టాస్క్ ఫోర్సు అధికారులు తెలిపారు. ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా సహకరిస్తున్న కోర్టు సిబ్బందిని అభినందించారు.
Read also: Kakinada: కాకినాడ, అన్నవరం మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే