Latest news: Rayalaseema: రాయలసీమ వారసత్వ స్ఫూర్తిని కవులు సమాజానికి అందించాలి

Read Time:  1 min
Rayalaseema
Rayalaseema
FONT SIZE
GET APP

అనంతపురం : రాయలసీమ(Rayalaseema) వారసత్వ స్ఫూర్తిని కవులు కళాకారులు సమాజానికి అందించాలి. రాయలసీమ సమాజం చైతన్యం కోసం కవులు చైతన్య వారధులుగా నిలవాలని రాయలసీమ మహాకవి సమ్మేళనంలో ముఖ్య అతిధిగా విచ్చేసిన విశ్రాంత ఉపకులపతి ఆచార్య కాడా రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. రాయలసీమ నేల చారిత్రక, సాంస్కృతిక నెలవైనదని భావితరాలకు ఆ వారసత్వ స్ఫూర్తిని కవులు సమాజానికి అందించాలని ఆయన కోరారు.

Read Also: AP: డిసెంబర్ 1వ తేదీ – ప్రజల సమస్యల పరిష్కారం

రాయలసీమ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో డల్లాస్ ఏరియా రాయలసీమ(Rayalaseema) అసోషియేషన్ సౌజన్యంతో అనంతపురం(Anantapur)లోని జిల్లాపరిషత్ ప్రాంగణ సమావేశ మందిరంలో ఆదివారం 180 మంది కవులతో సీమ ప్రసిద్ధ ప్రదేశాలపై రాయలసీమ కవిసమ్మేళనం జరిగింది. రాయలసీమ సాంస్కృతిక వేదిక సమన్వయకర్త డా. అప్పిరెడ్డి, హరినాథరెడ్డి కవి సమ్మేళనాన్ని సమన్వయం చేసారు.

సాహిత్య ప్రముఖులు

ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయితలు బండి నారాయణ స్వామి, శాంతి నారాయణ, ఏలూరి యంగన్న, సడ్లపల్లి చిదంబరరెడ్డి తదితర సాహిత్య ప్రముఖులు, విశ్రాంత ఆచార్యులు లక్ష్మినారాయణరెడ్డి, రవీంద్రారెడ్డి, మానవతా రక్తదాతల బృందం కన్వీనర్ తరిమెల అమరనాథరెడ్డి, రైతుసంఘం నాయకులు శ్రీనివాసరెడ్డి, సీమ ప్రజా సంఘాల నాయకులు వెంకటేష్, రాహుల్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమంలో తమ సందేశాలు ఇచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్న కవులందరికి నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.