రాష్ట్ర ప్రభుత్వం (AP State Govt) తాజాగా రేషన్ కార్డుదారులకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికీ (e-KYC) పూర్తి చేయని రేషన్ కార్డులు రద్దు చేస్తామని స్పష్టంగా ప్రకటించింది. రేషన్ వ్యవస్థలో పారదర్శకత, నిజమైన లబ్ధిదారులకు సబ్సిడీలు అందేలా చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read Also: WWC 2025: శ్రీచరణికి రూ. 2.5 కోట్లు, గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చిన ఏపీ సర్కార్
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు ప్రభుత్వ రేషన్ పథకానికి అర్హులుగా ఉన్నారు.. అయితే వీరిలో కొంతమంది ఇంకా e-KYC పూర్తి చేయలేదు. దీనివల్ల నకిలీ రేషన్ కార్డులు, డూప్లికేట్ సభ్యుల పేర్లు, అనర్హుల వినియోగం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి కార్డు హోల్డర్ కూడా తప్పనిసరిగా e-KYC చేయించాలని ఆదేశించింది.

e-KYC అంటే ఏమిటి?
e-KYC అనేది “ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్” (“Electronic Know Your Customer”) అనే పదానికి సంక్షిప్త రూపం. రేషన్ కార్డులో ఉన్న వ్యక్తుల ఆధార్ వివరాలను ధృవీకరించడం ద్వారా ప్రభుత్వం వారి నిజమైన గుర్తింపును నిర్ధారిస్తుంది. దీని ద్వారా మోసాలు, ఫేక్ కార్డుల దుర్వినియోగం నివారించవచ్చు.
ఎలా చేయాలి e-KYC?
రేషన్ కార్డు ఉన్న వ్యక్తులు తమ రేషన్ డీలర్ వద్ద ఉన్న ఈ-పోస్ (ePOS) యంత్రంలో వేలిముద్ర ఇవ్వడం వేయడం ద్వారా సులభంగా e-KYC పూర్తి చేయవచ్చు. అదనంగా, కొన్ని ప్రాంతాల్లో రైస్ మిల్లులు, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది కూడా ఈ ప్రక్రియకు సహాయం అందిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: