Latest News: Ramoji Rao: నేడు రామోజీ ఎక్స్‌లెన్స్‌ నేషనల్ అవార్డ్స్‌ కార్యక్రమం

Read Time:  1 min
Latest News: Ramoji Rao: నేడు రామోజీ ఎక్స్‌లెన్స్‌ నేషనల్ అవార్డ్స్‌ కార్యక్రమం
FONT SIZE
GET APP

రామోజీ గ్రూప్‌ వ్యవస్థాపకులు, మీడియా ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్న రామోజీరావు ( Ramoji Rao) పేరు మీద ఏర్పాటు చేసిన ‘రామోజీ ఎక్స్‌లెన్స్‌ జాతీయ అవార్డుల’ ప్రదానోత్సవం ఈరోజు సాయంత్రం జరుగనుంది. రామోజీరావు జయంతిని పురస్కరించుకుని నిర్వహించే ఈ వేడుకకు భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

Read Also: Mahesh Babu: టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌

ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా

రామోజీరావు జయంతి (Ramoji Rao’s birthday) ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా అనేక రంగాల్లో విశేష కృషి చేసిన ప్రతిభావంతుల్ని గుర్తించి సత్కరించేందుకు నిర్వహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,

కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్‌నాయుడు విచ్చేయనున్నారు. వీరితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ కూడా పాలుపంచుకోనున్నారు.వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి,

సమాజ హితమే లక్ష్యంగా పనిచేస్తున్న ఏడుగురు విశిష్ట వ్యక్తులకు ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. జర్నలిజం, గ్రామీణాభివృద్ధి, కళ-సంస్కృతి, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, మహిళా సాధికారత, మానవ సేవ, యూత్‌ ఐకాన్‌ విభాగాల్లో ఈ సత్కారం ఉంటుంది. ఈ సందర్భంగా ‘రామోజీ నిఘంటువులు’ కూడా విడుదల చేయనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.