हिन्दी | Epaper
టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్

Ramakrishna Reddy: ఐదేళ్ల పాలనలో ప్రతి వర్గానికి మేలు చేశాడు జగన్‌

Tejaswini Y
Ramakrishna Reddy: ఐదేళ్ల పాలనలో ప్రతి వర్గానికి మేలు చేశాడు జగన్‌

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) తన ఐదేళ్ల పాలనలో ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యం ఇచ్చారని, తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయాల్సిన కార్యక్రమాలపై కూడా ఆయనకు స్పష్టమైన కార్యాచరణ ఉందని పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి (Ramakrishna Reddy) తెలిపారు. తాడేపల్లి సమీపంలోని కుంచనపల్లి వద్ద నిర్వహించిన జగన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సజ్జల, భారీ కేక్‌ను కట్ చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు.

Read also: AP Politics: సోషల్ మీడియాలో రాజకీయ యుద్ధం.. పవన్ వ్యాఖ్యలకు అంబటి ఘాటు కౌంటర్

Ramakrishna Reddy: Jagan did good for every community in his five years of rule

ప్రజల కోసం పనిచేసిన నాయకుడు జగన్‌

జగన్ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల మద్దతు ఆయనకే ఉంటుందని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు నిజమైన మేలు చేయగల నాయకుడు జగన్ ఒక్కరేనన్న నమ్మకం కోట్లాది మందిలో ఉందని అన్నారు. అందుకే తన పాలనలో ప్రతి వర్గానికి లబ్ధి చేకూర్చేలా ఆయన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ఓదార్పు యాత్ర సమయంలోనూ, కరోనా మహమ్మారి కష్టకాలంలోనూ జగన్ ప్రజల పక్షాన నిలిచిన తీరును ఆయన గుర్తు చేశారు.

పబ్లిసిటీకి దూరంగా సంక్షేమ పాలన

జగన్ ఎప్పుడూ ప్రచారంపై ఆసక్తి చూపలేదని, పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి కాలనీలు ఏర్పాటు చేయడం, 17 మెడికల్ కాలేజీలు, పోర్టులు, హార్బర్లు వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టినా వాటికి ప్రచారం చేసుకోలేదని సజ్జల పేర్కొన్నారు. మరోవైపు చంద్రబాబు తన పాలనలో భారీగా అప్పులు చేసినప్పటికీ ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. ఆర్థిక నిపుణులు సైతం ఆశ్చర్యపోయేలా జగన్ తన ఐదేళ్ల పాలనను సమర్థవంతంగా నిర్వహించారని సజ్జల ప్రశంసించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870