Rajahmundry milk poisoning : అమృతంలా భావించి ప్రతిరోజూ తాగే పాలు… అదే ప్రాణాంతక విషంగా మారితే? రాజమండ్రిలో జరిగిన ఘటన ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఉదయం తాజా పాలు అనుకుని తాగిన కుటుంబాలు, అందులో కల్తీ రూపంలో మృత్యువు పొంచి ఉందని ఊహించలేకపోయాయి. ఈ విషాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో 13 మంది ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
రాజమండ్రి చౌడేశ్వర నగర్లో కల్తీ పాలు తాగిన వారిలో కృష్ణవేణి (85), కనకరత్నం (70) అనే ఇద్దరు వృద్ధ మహిళలు చికిత్స పొందుతూ మృతిచెందారు. అదే పాలు తాగిన మరో 13 మందికి తీవ్ర అస్వస్థత కలగడంతో వారిని అత్యవసరంగా ఆస్పత్రులకు తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
Read Also: Shikhar Dhawan ties knot : రెండో పెళ్లి చేసుకున్న శిఖర్ ధవన్
బాధితులందరూ ‘అనూరియా’ అనే ప్రమాదకర (Rajahmundry milk poisoning) లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితిలో కిడ్నీలు పని చేయకుండా మూత్ర విసర్జన పూర్తిగా ఆగిపోతుంది. ఘటనపై స్పందించిన పోలీసులు కల్తీ పాలు సరఫరా చేస్తున్న వ్యాపారిని అరెస్టు చేశారు. పాల నమూనాలను సేకరించి పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు.
అయితే ఈ ఘటనకు కల్తీ పాలు మాత్రమే కారణమా? లేక అపార్ట్మెంట్లోని నీటి ట్యాంకులు శుభ్రం చేయకపోవడం వల్ల ఏదైనా సంక్రమణ వ్యాధి వ్యాపించిందా? అనే కోణంలో కూడా వైద్యులు పరిశీలిస్తున్నారు. పూర్తి ల్యాబ్ నివేదికలు వచ్చిన తర్వాతే ఈ విషాదానికి అసలు కారణం బయటపడనుంది. ఈ ఘటనతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: