Rajahmundry Milk Adulteration: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారం అత్యంత విషాదాన్ని నింపింది. ఈ కల్తీ పాలను సేవించడం వల్ల ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
Read also: Vijay-Pawan: పవన్ కళ్యాణ్ రూట్లోనే విజయ్? రెండు చోట్ల పోటీకి సిద్ధం!
100 లీటర్ల పాలలో 100 లీటర్ల నీరు, తెల్లటి నురగ కోసం 10 కేజీల యూరియా, ఇతర రసాయనాలు కలిపినట్లు తెలుస్తోంది. ఈ కల్తీ పాల దందా రాజమండ్రితో పాటు ఇతర ప్రాంతాల్లోనూ కొనసాగుతోందని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కల్తీ పాల వ్యవహారంతో ఆందోళన
ఏది ఏమైనా ఏపీలోని రాజమహేంద్రవరంలో ఇప్పుడు కల్తీ పాల వ్యవహారం కలకలం రేపుతుంది. ప్రతి ఒక్కరికి ఆందోళన కలిగిస్తుంది. అసలు ఏం జరిగింది ఎందుకు ఇంతమంది అస్వస్థతకు గురయ్యారు అన్నది తెలియాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: