ఆంధ్రప్రదేశ్ వాతావరణం ఈ మధ్య వేగంగా మారుతోంది. విపరీతమైన వేడి మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ ఇచ్చిన తాజా హెచ్చరికల ప్రకారం, రాబోయే రెండు రోజులలో ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురవొచ్చు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు ఉండే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచనలివ్వబడ్డాయి.
ద్రోణుల ప్రభావం ఏపీలో ఎలా ఉంది?
ప్రస్తుతం వాయవ్య ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. ఉత్తర తమిళనాడు నుంచి దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 & 4.5 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించింది.
వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర తీర ఒడిశా & దక్షిణ గంగా తీర పశ్చిమ బెంగాల్ మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 & 5.8 కి.మీ మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి మరియు పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల రెండు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం ప్రాంతం
మంగళవారం (జూన్ 10): తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చు. ఈదురు గాలులు గంటకు 40-60 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది.
బుధవారం (జూన్ 11): వర్షాలు మరింత విస్తరించే సూచనలు ఉన్నాయి. అనేక చోట్ల వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశమూ ఉంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్
మంగళవారం: కొన్నిచోట్ల వర్షాలు పడొచ్చు. వేడి, తేమ కలిగిన అసౌకర్య వాతావరణం ఏర్పడే అవకాశముంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 60 కి.మీ వరకు వేగంతో గాలులు వీచే సూచన ఉంది.
బుధవారం: వర్షపాతం మరింత విస్తృతం కానుంది. అనేక ప్రాంతాల్లో వర్షాలు పడతాయని అంచనా. గాలులు వేగంగా వీచే అవకాశం ఉండటంతో, రహదారి ప్రయాణికులు, రైతులు అప్రమత్తంగా ఉండాలి.
రాయలసీమ ప్రాంతాల్లో వర్ష సూచనలు
మంగళవారం: కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, గాలులు గంటకు 40-60 కి.మీ వేగంతో వీచే సూచన ఉంది.
బుధవారం: చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే సూచనలు వున్నాయి. రాయలసీమ ప్రాంతాల్లో పొలాలు వరుస వర్షాలకు తడిచే అవకాశం ఉండటంతో, సాగు పంటలపై ఇది ప్రభావం చూపే అవకాశముంది.
ప్రజలకు సూచనలు:
- గాలివానల సమయంలో ఓపెన్ ప్రాంతాల్లో ఉండకూడదు.
- మొబైల్ టవర్లు, చెట్లు, విద్యుత్ స్తంభాల దగ్గర ఉండడం తప్పించాలి.
- రైతులు సాగు పంటల్ని కాపాడే చర్యలు తీసుకోవాలి.
- రహదారి ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
- వానపాత్రల సమాచారం కోసం స్థానిక వాతావరణ శాఖ హెచ్చరికల్ని అనుసరించాలి.
Read also: PSR Anjaneyulu: ఆంజనేయులుకు హైకోర్టులో లభించని ఊరట