📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

News Telugu: Rain Alert: మరో ఐదు రోజులు వర్షసూచన

Author Icon By Rajitha
Updated: September 27, 2025 • 11:54 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ VIjayavada :బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలపడుతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ అల్పపీడనం కొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. అది శనివారం ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశముందని అంచనా వేశారు. దీని ప్రభావంతో 5 రోజులపాటు మోస్తరు వర్షాల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం, తుపాను హెచ్చరికల కేంద్రాలు తెలిపాయి. Rain Alert ఇక వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా తీరంలో అల్పపీడనం కొనసాగుతుండగా, మరోవైపు తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ, నేడు వాయుగుండంగా బలపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. శనివారం వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

Godavari:మొదటి ప్రమాద హెచ్చరిక జారీ, అధికార యంత్రాంగం అప్రమత్తం

Rain Alert

సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అల్లూరి, కాకినాడ, ప.గో., కోనసీమ, కర్నూలు ఎల్లో అలెర్ట్ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇవాళ నంద్యాల, అనంతపురం, కడప జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురస్తాయని తెలిపింది. కోస్తా తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. Rain Alert కృష్ణపట్నం మినహా మిగతా ఓడరేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎవ్వరి మొబైల్ లోనైనా దామిని యాప్ ఉంటే పిడుగుల సమాచారాన్ని వారే తెలుసుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటిలోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సులభంగా పొందవచ్చు. మనకు దగ్గరలో 20 నుంచి 20 కిలోమీటర్లు పరిధిలో పిడుగులు పడే అవకాశాలు ఉంటే గనక ఈ యాప్ మనల్ని ముందుగానే అప్రమత్తం చేస్తుంది. అలాగే కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేర్లు ఈ యాప్లో నమోదు చేయవచ్చు. దాంతో వారిని అప్రమత్తం చేసే వీలుంటుంది.

బంగాళాఖాతంలో ఏ వాతావరణ పరిస్థితి ఏర్పడింది?
తీవ్ర అల్పపీడనం బలపడుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉంది.

వాయుగుండం ఎప్పుడు, ఎక్కడ తీరం దాటే అవకాశం ఉంది?
శనివారం ఉదయానికి దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Andhra Pradesh Weather Breaking News cyclone in bay of bengal heavy rains alert IMD forecast latest news nellore krishnapatnam Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.