Rain Alert: విపత్తు నివారణ సంస్థ అధికారులతో సమీక్షించిన హోంమంత్రి అనిత (Anitha) వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి విజయవాడ : బంగాళా ఖాతంలోని తీవ్ర అల్పపీడనం రాబోయే 12 గంటల్లోపు వాయుగుండంగా బలపడనున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతూ ఆ తదుపరి 12 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో అతిభారీ వర్షాల నేపథ్యంలో విపత్తుల నిర్వహణసంస్థ అధికారులతో హోంమంత్రి అనిత బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయరాదని సూచించారు. సహయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పోలిస్, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు.
Read also: Rain Alert: APలో పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరిక

Rain Alert: మరో 3 రోజులు భారీ వర్షాలు
జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ 24/7 అలెర్ట్ ఉండాలని ఆదేశాలు జారీచేశారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని.. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. వాతావరణ పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక మెస్సేజులు పంపాలని అధికారులకు తెలియజేశారు. సహయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలన్నారు. ప్రజలు సురక్షితమైన భవనాల్లో ఉండాలని హోంమంత్రి అనిత వినతి చేశారు,ఇక శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, (Nellore) తిరుపతి, వైఎస్సార్ కడప, అన్న మయ్య, చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరేంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీనుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం,శ్రీసత్యసాయి జిల్లాలకు ఎల్లో అలర్ట్ చేసింది. గురువారం (ఈ నెల23వ తేదినుంచి) నుంచి ఆదివారం వరకు రాష్ట్రంలోని అక్కడక్కడ భారీ వర్షాలు (Rain Alert) కొనసాగే అవకాశం ఉంది.
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుంది?
రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
హోంమంత్రి అనిత ఎవరితో సమీక్ష నిర్వహించారు?
విపత్తు నివారణ సంస్థ అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: