Rain Alert: ఆంధ్రప్రదేశ్లో మొంథా తుఫాను ప్రభావం కొనసాగుతోంది. ఉత్తరాంధ్రతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం (vishakapatnam) నగరంలో వర్షం దంచికొడుతుండటంతో రోడ్లు జలమయంగా మారాయి. బలమైన ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు, కొమ్మలు విరిగిపడగా, విద్యుత్ సరఫరా కొన్నిచోట్ల అంతరాయం కలిగింది. తుఫాను ప్రభావం వల్ల నెల్లూరు, తిరుపతి, కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అన్నమయ్య జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షం తడవుతో పాటు గాలులు కూడా వేగంగా వీయడంతో ప్రజలు బయటకు రావడానికే ఇబ్బంది పడుతున్నారు.
Read also: Air Pollution: వాయు కాలుష్యంతో భారత్ లో మసకబారుతున్న సూర్యుడు
Rain Alert: తుఫాను ఎఫెక్ట్.. విశాఖలో వర్ష బీభత్సం
వాతావరణ (weather) శాఖ తెలిపిన వివరాల ప్రకారం, మొంథా తుఫాను తీరం వైపు క్రమంగా చేరుకుంటోంది. దీంతో రాబోయే గంటల్లో వర్షాల తీవ్రత (Rain Alert) మరింత పెరగవచ్చని హెచ్చరించింది. తుఫాను భీకరత దృష్ట్యా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అధికారులు ఇప్పటికే సహాయక బృందాలను సిద్ధంగా ఉంచారు.
మొంథా తుఫాను ప్రభావం ఎక్కడ ఎక్కువగా ఉంది?
ఉత్తరాంధ్ర ప్రాంతంలో, ముఖ్యంగా విశాఖపట్నంలో వర్షాలు తీవ్రంగా ఉన్నాయి.
ఏ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి?
నెల్లూరు, తిరుపతి, కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: