Rain Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ఇది మంగళవారం రాత్రి నాటికి తీవ్రమైన తుఫానుగా మారే అవకాశం ఉంది. దీనికి సిద్ధంగా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. తీర ప్రాంతాల్లో సంభవించే వర్షాలు, గాలివానలు, వరదల నష్టం నివారించేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బలగాలను రంగంలోకి దింపింది. గన్నవరం మండలం కొండపావులూరులోని NDRF పదో బెటాలియన్ నుండి ఆరు బృందాలు తుఫాన్ ప్రభావిత జిల్లాలకు తరలించబడ్డాయి.
Read also: Montha Cyclone: మొంథా తుఫాన్.. ఏపీ స్కూళ్లకు 3 రోజులు సెలవులు

Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆంధ్రకు తీవ్ర తుఫాను
ప్రతి బృందంలో 30 మంది శిక్షణ పొందిన సిబ్బంది ఉండగా, వీరిని శ్రీకాకుళం (srikakulam) నెల్లూరు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు పంపించారు. ఈ బృందాలు తుఫాన్ సమయంలో రక్షణ చర్యలు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, తుపాన్ తర్వాత పునరావాస చర్యల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. కమాండెంట్ ప్రసన్నకుమార్ సిబ్బందికి జాగ్రత్తలు, సహాయక చర్యలపై దిశానిర్దేశం ఇచ్చారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులతో సమన్వయం ఏర్పరచింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించింది.
ఎన్ని జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించబడ్డాయి?
మొత్తం ఆరు జిల్లాల్లో బృందాలను మోహరించారు.
తుఫాన్ ఏ ప్రాంతాలను ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం ఉంది?
శ్రీకాకుళం, నెల్లూరు, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు ప్రధానంగా ప్రభావితం కావచ్చని అంచనా.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: