News Telugu: Rain Alert: కోస్తా అలర్ట్! కృష్ణా జిల్లాలో తుఫాన్ ప్రభావం

Read Time:  1 min
Rain Alert
Rain Alert
FONT SIZE
GET APP

ఇప్పటివరకు మొత్తం 11317 మందిని పునరావాస కేంద్రాలకు చేరవేసింది. అంతేకాకుండా ఉచితంగా వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసి జ్వరము, జలుబు, దగ్గు, వాంతులు, విరోచనాల నివారణకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచడం జరిగింది. సముద్ర తీర ప్రాంతంలో ఎలాంటి ప్రమాదాలు జరిగిన వెంటనే స్పందించి కాపాడుటకు ఎక్కడికక్కడ మొత్తం 196 పడవలు, 296 గజ ఈతగాళ్లను లైఫ్ జాకెట్లతో సిద్ధంగా ఉంచారు. నాగాయలంకలోనీ శ్రీపాద క్షేత్రం నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుటుంబాలు దెబ్బలో చిక్కుకుపోయిన నలుగురు గొర్రెల కాపరులను మత్స్యశాఖ అధికారులు, సిబ్బంది ఎంతగానో కృషి చేసి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మచిలీపట్నం నగరంలోని సాయిబాబా గుడి దగ్గర ఉన్న మురికి కాలువలో పశువులను సురక్షితంగా బయటకు తీసి కాపాడారు. జిల్లాలో ప్రమాదాలను ప్రమాదాలు జరిగితే కాపాడేందుకు వీలుగా రెండు ఎన్డిఆర్ఎఫ్ బృందాలను జిల్లాకు రప్పించి మచిలీపట్నం గుడివాడ డివిజన్లలో ఉంచడం జరిగింది. కృత్తివెన్ను మండలం వాలంక గ్రామానికి చెందిన కోయ సుబ్బా రావు (55) పై చెట్టు విరిగిపడటంతో కాలు పెరిగింది.

Read also: Montha Cyclone: రెండు తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుఫాన్‌ బీభత్సం

Rain Alert

Rain Alert

108 వాహనంలో ఎక్కించి చికిత్స నిమిత్తం మచిలీపట్నం (Machilipatnam) ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చేర్చారు. తుఫాను ప్రభావానికి జిల్లాలో 12 మండలాల్లోని 68 గ్రామాలు, 5 పట్టన ఆవాసాలల్లో 41,729 మంది ప్రజలు ప్రభావితం అవుతున్నారని, ఇప్పటి వరకూ 35,114 మందిని సురక్షిత ప్రదేశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు. మొత్తం 401 పునరావాస కేంద్రాలు ఏర్పాటుకు సిద్ధం చేసి ఇప్పటి వరకూ 81 కేంద్రాలను తెరిచామని, లోతట్టు ప్రాంతాలలోని 9901 పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందని, 52 మంది పశు వైద్యులతో 30 పశువైద్య శిభిరాలు ఏర్పాటు చేసి 200 మెట్రిక్ టన్నుల పశుగ్రాసం, 17 వేల వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచామన్నారు. సముద్ర వేటవలో ఉన్న బోట్లన్నిటినీ తీరానికి రప్పించామని, 4,573 బోట్లు కొట్టుకుపోకుండా ఉప్పుటేరు, క్రీక్లలో ఉంచుకోవాలని మత్స్యకారులకు సూచించామని తెలియజేసారు. విజయవాడ డివిజన్లోని ప్రధాన రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. తుఫాన్ కారణంగా రాష్ట్రంలో రైలు సర్వీసులను రైల్వే శాఖ రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం నుంచి నడిచే దాదాపు 100 మేర విమాన సర్వీసులు రద్దయ్యాయి. కోస్తా జిల్లాల మీదుగా నడిచే మొత్తం 95 రైళ్ల సర్వీసులను రద్దు చేసినట్లు విజయవాడ డివిజనల్ రైల్వే తెలిపింది.

మొంథా తుఫాను కారణంగా ఎంతమంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు?
ఇప్పటి వరకు మొత్తం 35,114 మంది ప్రజలను సురక్షిత ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు.

పశువుల రక్షణ కోసం ఏ చర్యలు తీసుకున్నారు?
9,901 పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించి, 30 పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. 200 మెట్రిక్ టన్నుల పశుగ్రాసం, 17,000 వ్యాక్సిన్లు సిద్ధంగా ఉంచారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.