📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Raghurama Krishnam Raju – అసెంబ్లీ బహిష్కరణపై జగన్‌పై రఘురామకృష్ణ ఫైర్

Author Icon By Anusha
Updated: September 22, 2025 • 12:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైసీపీ అధినేత వై.ఎస్. జగన్, పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన నేపథ్యంలో అధికారపక్ష నేతల ఆవేదన తీవ్రంగా వ్యక్తమైంది. ప్రతిపక్ష హోదా పొందడం అంటే కొలతలేని రకమైన సౌలభ్యం కాదని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. సభకు వరుసగా 60 రోజుల పాటు గైర్హాజరైతే సభ్యత్వం రద్దు అవుతుందనే నిబంధన జగన్‌కు తెలియదా? అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (Deputy Speaker Raghuramakrishna Raju) ప్రశ్నించారు. 

పశ్చిమగోదావరి జిల్లా పెద అమిరంలో రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ, “గతంలో ఎంపీగా, ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్‌ (Jagan) కు శాసనసభ నిబంధనలు తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది” అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 190(4) ప్రకారం, సభాపతి అనుమతి లేకుండా వరుసగా 60 రోజుల పాటు సమావేశాలకు హాజరుకాని సభ్యుడు అనర్హుడు అవుతాడని ఆయన స్పష్టం చేశారు. 

ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులకు

ఇదే విషయం అసెంబ్లీ (Assembly) నిబంధనావళిలోని క్లాజ్ 187(2)లో కూడా ఉందని, ఈ రూల్స్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని, వైసీపీ నేతలు (YCP leaders) వాటిని పరిశీలించాలని సూచించారు. ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులకు రెండు ప్రశ్నలు కేటాయిస్తున్నా, వారు సభలో ఉండటం లేదని ఆయన తెలిపారు.

Raghurama Krishnam Raju

మరోవైపు ఒంగోలులో హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) మాట్లాడుతూ, “ప్రతిపక్ష హోదా అనేది చాక్లెట్టో, బిస్కెట్టో కాదు.. చిన్నపిల్లాడిలా మారాం చేయగానే ఇవ్వడానికి. అది ప్రజలు ఇవ్వాలి” అని అన్నారు.

‘అధ్యక్షా’ అని మాట్లాడే భాగ్యాన్ని కోల్పోయారని

జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఒక్కసారి కూడా ‘అధ్యక్షా’ అని మాట్లాడే భాగ్యాన్ని కోల్పోయారని ఆమె విమర్శించారు. గతంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఒక్కరే సభ నుంచి బయటకు వెళ్లినా,

టీడీపీ ఎమ్మెల్యేలంతా సభలో ఉండి ప్రజా సమస్యలపై పోరాడారని గుర్తు చేశారు. ప్రస్తుతం జగన్ కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని, ఆ హోదాలోనే సభలో మాట్లాడాలని అనిత స్పష్టం చేశారు. 

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/coconut-they-carried-away-as-many-coconut-shells-as-they-could-find/telangana/551776/

Assembly boycott Breaking News Deputy Speaker Raghuramakrishna Raju Jagan Mohan Reddy latest news legislative rules ruling party criticism Telugu News West Godavari YSRCP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.