हिन्दी | Epaper

Raghurama Krishnam Raju: నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే హోంమినిస్టర్ అవుతాను: రఘురామ

Sharanya
Raghurama Krishnam Raju: నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే హోంమినిస్టర్ అవుతాను: రఘురామ

అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఈ మధ్యనే జరిగిన తానా (Telugu Association of North America) 24వ ద్వైవార్షిక మహాసభలు రాజకీయ, సాంస్కృతిక రంగాల ప్రముఖులను ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు (Raghurama Krishnam Raju) ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్నారు. ఆయన తనదైన చమత్కారమైన భాషలో చేసిన వ్యాఖ్యలు సభను కడుపుబ్బ నవ్వించాయి.

యాంకర్ ప్రశ్న – రఘురామ ప్రతిస్పందన:

ఈ కార్యక్రమంలో యాంకర్ మూర్తి చేసిన ఓ ప్రశ్న సభలో నవ్వులు పూయించింది. ఒక్కరోజు గనుక మిమ్మల్ని రాష్ట్ర మంత్రిగా చేస్తే మీరు ఏ శాఖలు కోరుకుంటారు? అని కార్యక్రమ యాంకర్ మూర్తి ప్రశ్నించారు. అందుకు రఘురామ (Raghurama Krishnam Raju) బదులిస్తూ, రోజులో 8 గంటలు తనను మంత్రిగా చేస్తే 6 గంటలు హోంమంత్రిగా, మిగతా 2 గంటలు వైద్య ఆరోగ్య మంత్రిగా (Minister of Medical Health) పనిచేస్తానని అన్నారు.

“రెడ్ బుక్ ఉంది?” – యాంకర్

ఆ తర్వాత యాంకర్ మూర్తి మరో ఆసక్తికర ప్రశ్న చేశారు. మీరు హోంమంత్రి అయితే రెడ్ బుక్ అమలు చేస్తారా అని యాంకర్ మూర్తి అడగ్గా తన వద్ద రెడ్ బుక్ ఉండదని, అది వేరే వాళ్ల వద్ద ఉందని రఘురామ బదులిచ్చారు. అయితే, తనదగ్గర బ్లడ్ బుక్ (Blood Book) ఉందని స్పష్టం చేశారు. గతంలో తనపై జరిగిన అరాచకాల తాలూకు రక్తపు చారలు తనకు ఇంకా గుర్తున్నాయని రఘురామ అన్నారు. ఆ విధంగా తాను బ్లడ్ బుక్ తో ముందుకెళతానని తెలిపారు.

సోషల్ మీడియాలో వైరల్

ఈ వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా “బ్లడ్ బుక్” అనే పదాన్ని వినిపించగానే సభలో ఉన్నవారంతా శబ్దంతో స్పందించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Jagan: తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870