Puttaparthi: అమరావతి : ఈనెల 20న తిరుపతి, 22న పుట్టపర్తిలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన, ఈనెల 14న భారత ఉప రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విశాఖపట్నం పర్యటన, ఈనెల 19న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) పుట్టపర్తి పర్యటన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ బుధవారం రాష్ట్ర సచివాలయం నుండి వివిధ శాఖల అధికారులతో వీడియో సమావేశం ద్వారా చేయాల్సిన ఏర్పాట్లపై ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ దేశ అత్యున్నత ప్రముఖులైన వారి వారి పర్యటనలకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
Read also: AP: వర్సిటీలన్నింటికీ ఒకటే చట్టం..ప్రభుత్వం యోచన

AP: రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లపై సిఎస్ సమీక్ష
విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని
Puttaparthi: ఏర్పాట్ల విషయంలో ఏలాంటి లోపాలకు ఆస్కారం లేని రీతిలో విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను సిఎస్ విజయానంద్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఆయా పర్యటనల పర్యవేక్షణ రాష్ట్ర నోడలు అధికారైన టిఆర్ అండ్బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యంటి కృష్ణబాబు, జిఏడి ముఖ్య కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా, శాంతి భద్రతల అదనపు డిజి మధుసూదన రెడ్డి, వర్చువల్ గా తిరుపతి, సత్యసాయి జిల్లాల కలక్టర్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: