📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

25 శాతం తేమ ఉన్నధాన్యం కొనుగోలు

Author Icon By Vanipushpa
Updated: January 21, 2025 • 1:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధితోపాటు సంక్షేమానికి కూడా సమాన ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు. రైతుల విషయంలో పనులు ఆలస్యం కాకూడదని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఇటీవలే అకాల వర్షాలవల్ల ధాన్యం తడిసి రైతులు ఆందోళన పడుతుంటే అందులో 25 శాతం వరకు తేమ ఉన్నప్పటికీ కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ లో ధాన్యం సేకరణ, రైతులకు డబ్బుల చెల్లింపులు తదితర విషయాల్లో ఎంతో అప్రమత్తంగా ఉంటున్నట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. గడిచిన 24 గంటల వ్యవధిలో అన్నదాతలకు దాదాపు రూ.5,900 కోట్లు చెల్లించినట్లు మంత్రి తెలిపారు.

2024-25 ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ, డబ్బుల చెల్లింపుల గురించి మంత్రి నాదెండ్ల మనోహర్ ట్వీట్ చేశారు. డబ్బులు చెల్లించడంవల్ల ఆరు లక్షల మంది రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసిందని, గత ప్రభుత్వం ధాన్యం బకాయిలు చెల్లించకుండా అన్నదాతలను ఎంతగా ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలిసిందే అన్నారు. ధాన్యం సేకరించినప్పటికీ డబ్బులు మాత్రం చెల్లించకపోవడంతో ఎంతోమంది అన్నదాతలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని, తమ ప్రభుత్వానికి రైతులంటే ఎంతో గౌరవమని, రైతులకు మొదటి ప్రాధాన్యమని నాదెండ్ల మనోహర్ తెలిపారు. అలాగే పశు కిసాన్ క్రెడిట్ కార్డుద్వారా రైతులు పశుగ్రాసం కోసం రుణాన్ని పొందొచ్చు. పశువుల మేత కొనుగోలు బ్యాంకులు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి అని, దరఖాస్తు చేస్తున్న రైతులకు ప్రభుత్వ నియమ నిబంధనలకు అనగుణంగా రుణాన్ని మంజూరు చేస్తామన్నారు. తమకు పశువులు ఉన్నట్లుగా పశు వైద్య అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం కచ్చితంగా ఉండాలి అని మంత్రి తెలిపారు.

Andhra Pradesh formers moisture rice nadendla manohar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.