📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Telugu News:RDT-ఆర్డీటీ పరిరక్షణకు 23 నుంచి ఆందోళనలు

Author Icon By Pooja
Updated: September 22, 2025 • 1:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అనంతపురం: ప్రముఖ స్వచ్చంద సంస్థ ఆర్డీటీ పరిరక్షణే ధ్యేయంగా, ఆర్టీటీకి ఎఫ్సీఆర్ఎ లైసెన్స్‌లు(FCRA Licenses) ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 23వ తేదీ నుంచి దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని అఖిల పక్ష కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆర్టీటీకి ఎఫ్సీఆర్ఎ లైసెన్స్ ఇచ్చే విషయంలో జరుగుతున్న జాప్యంపై వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రౌండ్ టేబుల్ సమావేశం

స్థానిక ప్రెస్ క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశానికి సాకే వారి ఆధ్యక్షత వహించారు. సమావేశంలో ఆర్డీటీ పరిరక్షణ ఆఖిల పక్ష కమిటీ కన్వీనర్‌గా సాకే వారిని ఎంపిక చేసుకున్నారు. ఈ సమావేశానికి బీజేపీ మినహా తెలుగుదేశం, వైసీపీ, సీపీఐ, సీపీఎం తదితర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఎన్జీవోలు, దళిత సంఘాలు, మేధావులు హాజరయ్యారు.

ఆందోళన కార్యాచరణ లక్ష్యం

ఆర్డీటీ సంస్థను పరిరక్షించడమే ధ్యేయంగా కేంద్ర కార్యాలయాల ముట్టడి, రైల్లోకో,(National Highways) దిగ్బంధనం, జిల్లా బంద్, రాష్ట్ర బంద్, ఛలో ఢిల్లీ కార్యక్రమాల వంటి ఉద్యమాలు నిర్వాహణ చేయబడనున్నాయి. అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు తెలిపాయి.

ప్రధాన నాయకుల పాల్గొనడం

ఈ సమావేశంలో వైసీపీ పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, సీపీఐఎంఎల్, బీఎసీపీ తదితర పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే స్వచ్చంద సంస్థలు, ఆర్టీసీ సంఘం నాయకులు, మాల మహానాడు, పూసల సంఘం, న్యాయ వాధుల సంఘం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక నాయకులు కూడా హాజరయ్యారు.

ఆర్డీటీ కోసం ఆందోళన ఎందుకు?
ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఎ లైసెన్స్ ఇవ్వడంలో జాప్యం జరుగుతుండటంపై ఆందోళన.

ఆందోళన కార్యక్రమాలు ఎప్పుడు ప్రారంభం?
ఈ నెల 23వ తేదీ నుంచి దశల వారీగా ప్రారంభం అవుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/raghuramakrishna-raju-does-jagan-know-the-legislative-acts/andhra-pradesh/551785/

Andhra Pradesh Protests Breaking News in Telugu FCRA license Google News in Telugu RDT Protection RTI Telugu News Today Voluntary Organizations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.