📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

ప్రయివేట్ భూముల తొలగింపు

Author Icon By Uday Kumar
Updated: March 6, 2025 • 5:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రయివేట్ భూముల తొలగింపు నిర్ణయం

పేదలకు, నిజమైన భూ యజమానులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ప్రయివేట్ భూముల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గత నెల 17వ తేదీన మెమోను విడుదల చేశామని, నిషేధ ఆస్తుల జాబితా నుంచి ప్రయివేట్ భూములతొలగింపు గురించి స్పష్టమైన మార్గదర్శకాలు అందులో పేర్కొన్నామని తెలిపారు.

గ్రామ కంఠ భూములకు విముక్తి

శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పంచాయతీల్లో గ్రామ కంఠాల్లో ఉన్న ప్రయివేట్ వ్యక్తుల ఆస్తులను కూడా నిషేధ జాబితా నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. 2015లోనే అప్పటి ప్రభుత్వం 187 జీవో ద్వారా సామాజిక ఆస్తులు మినహా మిగిలిన భూములను తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నప్పటికీ, గత ప్రభుత్వం రీ సర్వే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 4,157 ఎకరాలను నిషేధ జాబితాలో చేర్చిందని చెప్పారు. దీని వల్ల సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇప్పుడు వాటిని పరిశీలించి తొలగించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

అక్రమ భూముల క్రమబద్ధీకరణకు ఒక ఏడాది గడువు

ప్రభుత్వ భూములను ఆక్రమించి ఇళ్లను నిర్మించుకున్న వారికి క్రమబద్ధీకరణ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. వీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఏడాది గడువును ఇచ్చినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన భూముల రీ సర్వే అనేక లోపాలతో నిండి ఉందని, అది భూ యజమానులకు న్యాయం చేసే విధంగా లేకుండా మార్చివేసిందని ఆరోపించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం సమగ్ర రీ సర్వే ద్వారా భూమి సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉందని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.

#APNews anagani satya prasad AndhraPradesh Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.