📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

ఈ నెల 29న విశాఖలో పర్యటించనున్న ప్రధాని మోడీ

Author Icon By sumalatha chinthakayala
Updated: November 25, 2024 • 10:14 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ఈ నెల 29న విశాఖలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాక.. విశాఖ నగరంలో ప్రధాని మోడీ రోడ్ షో, బహిరంగ సభకు హాజరుకానున్నారు. ప్రధాని వస్తుండడంతో, ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. సాయంత్రం 4.30 గంటలకు ఆంధ్రా వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో మోడీ సభ ఏర్పాటు చేశారు. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఇతర ప్రాజెక్టులకు ఈ సభ నుంచి మోడీ శంకుస్థాపన చేయనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో ఈ ప్రాజెక్టుల కోసం ఇప్పటికే 1200 ఎకరాలు కేటాయించింది. గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌లో 20 గిటావాట్‌ల విద్యుత్తును ఎన్టీపీసీ ఉత్పత్తి చేయనుంది. ఈ రెండు భారీ ప్రాజెక్టుల వల్ల నాలుగేళ్లలో 48వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. అమరావతి పనులు వచ్చే నెల నుంచి ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో కేంద్ర మంత్రివర్గం అమరావతి కి 54 కిలో మీటర్ల మేర కొత్త రైల్వే లైన్ కు ఆమోదం తెలిపింది. ఈ పనుల ప్రారంభం ప్రధానితో చేయించాలని చంద్రబాబు కోరుతున్నారు.

ఇకపోతే..ఏపీకి కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి వరుస గుడ్ న్యూస్ లు అందజేస్తున్న విషయం తెలిసిందే. ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపిన మోడీ..ఆ హామీ ప్రకారం ఏపీకి అందాల్సిన నిధులు , పోలవరం ప్రాజెక్ట్ పూర్తి , పెండింగ్లో ఉన్న పనులు ఇవన్నీ త్వరగా పూర్తి అయ్యేలా దృష్టి పెట్టారు. ఇక సీఎం చంద్రబాబు సైతం కేంద్ర మంత్రులతో ఎప్పటికప్పుడు సమావేశలవుతూ వస్తున్నారు.

PM Modi TDP-JanaSena-BJP Alliance Visakha tour visakhapatnam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.