ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శుక్రవారం సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నారు. జూన్ 21న విశాఖలో నిర్వహించనున్న ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొనేందుకే ఆయన ఈ ప్రయాణం చేశారు. ప్రధాని రాకతో నగరం జోష్కి నిదర్శనంగా మారింది. విమానాశ్రయంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు (CM Chandrababu), కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ కలిసి ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు.ప్రధాని మోదీకి స్వాగతం పలికిన విషయాన్ని మంత్రి నారా లోకేశ్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. “యోగాంధ్ర కోసం విశాఖ చేరిన గౌరవ ప్రధానికి స్వాగతం పలికాను,” అంటూ ట్వీట్ చేశారు. అంతేకాక, “మోదీ అంటే మోటివేషన్, మోదీ అంటే డెడికేషన్” అంటూ ప్రశంసలు కురిపించారు.
యోగా రికార్డుల దిశగా ఏపీ ముందంజ
మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, ఈసారి యోగా నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. “యోగా రికార్డులను బద్దలు కొట్టేందుకు ఏపీ పూర్తిగా సిద్ధమైంది,” అంటూ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం భారీ ఏర్పాట్లు పూర్తిచేసింది.జూన్ 21 ఉదయం 5:30 గంటలకు ‘యోగాంధ్ర’ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో దాదాపు 5 లక్షల మందికి పైగా పాల్గొననున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దేశంలోనే అత్యంత విస్తృతంగా జరిపేందుకు ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది.
సీఎం, మంత్రుల సమీక్షలతో ఏర్పాట్లు
చంద్రబాబు నేతృత్వంలో పలు రోజులుగా యోగాంధ్ర ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. మంత్రులు నారా లోకేశ్, పొంగూరు నారాయణ, జిల్లా అధికారులు నిర్విరామంగా పనిచేస్తున్నారు. మోదీ రాకతో విశాఖలో పండుగ వాతావరణం నెలకొంది. రోడ్లపై వెలుగు రేఖలు, ప్రధాని పోస్టర్లు నగరాన్ని ప్రత్యేకంగా మార్చేశాయి.
Read Also : cosmetic surgery : టర్కీలో కాస్మెటిక్ సర్జరీ వికటించి మొజాంబిక్ గాయని, మృతి