ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం (YCP Govt) పలు సంక్షేమ పథకాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా మలకపల్లిలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, వికలాంగులు కానప్పటికీ వారిని వికలాంగులుగా చూపించి కార్లు, లారీలు నడుపుకునే వ్యక్తులకు కూడా పెన్షన్లు ఇచ్చిన దారుణ పరిస్థితులు గత వైసీపీ పాలనలో చోటుచేసుకున్నాయని తెలిపారు.
ప్రజాధనం దుర్వినియోగం అనర్హులకు పెన్షన్లుగా
వైసీపీ కార్యకర్తలు (YCP), అనర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేసి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజల నమ్మకాన్ని మోసం చేస్తూ, అసలైన లబ్దిదారులను నష్టపరిచేలా వ్యవహరించారని విమర్శించారు. తన ప్రభుత్వంలో ఆ తరహా దుర్వినియోగానికి అవకాశం లేకుండా, పారదర్శకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.
పెన్షన్లకే నెలకు రూ.2,750 కోట్లు ఖర్చు
ప్రస్తుతం తన ప్రభుత్వం పెన్షన్ల కోసం నెలకు రూ.2,750 కోట్లు ఖర్చు చేస్తోందని చంద్రబాబు తెలిపారు. పేదలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం సమర్థంగా పని చేస్తుందని తెలిపారు. కానీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా, అర్హులైనవారికే లబ్ధి చేకూరేలా చూస్తామని తెలిపారు. సంక్షేమం పేరుతో మోసాలు జరగకుండా బలమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
Read Also : Chandrababu: త్వరలో నిరుద్యోగ భృతి – సీఎం చంద్రబాబు