
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) పుట్టపర్తిలో శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి సాయి కుల్వంత్ హాలులో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం ప్రశాంతి నిలయంలో జరిగే శతజయంతి ఉత్సవాల్లో ముర్ము (President Droupadi Murmu) పాల్గొని ప్రసంగించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు.
Read Also: Petrol Prices: పెరగనున్న పెట్రోల్ ధరలు?
ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి పుట్టపర్తికి
కాగా, రాష్ట్రపతి నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లారు. రాత్రికి రాజ్భవన్లో బస చేశారు. ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి పుట్టపర్తికి చేరుకున్నారు. పుట్టపర్తి ఎయిర్పోర్ట్లో ముర్ముకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఇతర అధికారులు స్వాగతం పలికారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: