📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Droupadi Murmu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Author Icon By Tejaswini Y
Updated: November 21, 2025 • 1:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం పద్మావతి అతిథి గృహం నుంచి బయలుదేరిన ఆమె, తిరుమల సంప్రదాయం ప్రకారం మొదట శ్రీ భూ వరాహస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత మహాద్వారం వద్దకు వచ్చిన రాష్ట్రపతికి టీటీడీ(TTD) ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌తో పాటు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్త పద్ధతిలో ఆతిథ్యం అందించారు. ధ్వజస్తంభానికి నమస్కారం చేసిన అనంతరం, రాష్ట్రపతి గర్భగుడిలోకి ప్రవేశించి శ్రీవారి మూలవిరాట స్వరూపాన్ని దర్శించుకున్నారు.

Read Also: TG Crime: కూతురు కులాంతర వివాహం చేసుకుందని.. మనస్థాపంతో తండ్రి ఆత్మహత్య

President Draupadi Murmu visits Tirumala

రంగనాయకుల మండపంలో వేదపండితులు

దర్శన సమయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఆమెతో ఉన్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు రాష్ట్రపతికి వేదాశీర్వచనం అందించగా, టీటీడీ ఛైర్మన్ మరియు ఈవో కలిసి శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు, 2026 క్యాలెండర్, డైరీలు అందజేశారు.

గురువారం తిరుపతికి చేరుకున్న రాష్ట్రపతి, మొదట తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం తిరుమలకు చేరుకున్న సందర్భంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మరియు టీటీడీ అధికారులు ఆమెను ఆహ్వానించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Andhra Pradesh Bhu Varahaswamy Padmavati Temple President Draupadi Murmu Sri Venkateswara Swamy temple visit tirumala tirupati TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.