📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Polavaram-Banakacherla Project : మ.3గంటలకు పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై ప్రజెంటేషన్

Author Icon By Sudheer
Updated: June 2, 2025 • 1:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు(Polavaram-Banakacherla Project)పై కాసేపట్లో కేంద్ర ప్రభుత్వానికి ప్రజెంటేషన్ (Presentation) ఇవ్వనుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖాధికారులకు రాష్ట్ర అధికారులు ప్రాజెక్టు వివరాలను సమర్పించనున్నారు. ఈ ప్రజెంటేషన్‌లో ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న ప్రాంతాలు, నీటి వినియోగం, సాగు భూములకు కలిగే లాభాలు, ప్రజలకు అందే మౌలిక సదుపాయాలు వంటి అంశాలను వివరంగా వివరించనున్నారు.

రూ.81 వేల కోట్ల అంచనా వ్యయం

ఈ ప్రాజెక్టును రూ.81 వేల కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ప్రధానంగా రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు, మూడోనీటి వనరులను సమర్థవంతంగా వినియోగించే లక్ష్యంతో ప్రాజెక్టును రూపొందించారు. ఇది వ్యవసాయోపాధికి ఊతమిచ్చేలా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. పోలవరం నుంచి సాగు నీటిని బనకచర్ల వరకు చేర్చే ఈ ప్రాజెక్టు ద్వారా పలు జిల్లాల రైతులు లబ్ధిపొందనున్నారు.

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ప్రాజెక్టు వివరాలు

గత నెలలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌లకు ఈ ప్రాజెక్టుపై ప్రాథమిక వివరాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా కేంద్రం నుంచి సహకారం అందించాలని సీఎం అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరింత విశ్లేషణతో కూడిన ప్రజెంటేషన్‌ను కేంద్రానికి ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Read Also : Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ ఆలస్యంపై స్పష్టత ఇచ్చిన నిర్మాత

Chandrababu Google News in Telugu polavaram Polavaram-Banakacherla Project Presentation Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.