తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) మాజీ మంత్రి కేటీఆర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు (Indiramma’s house grant) కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, కేటీఆర్ను ఉద్దేశించి “పదేళ్లు అధికారంలో ఉండి ఒక్కరికి ఇల్లు కూడా ఇవ్వలేని దద్దమ్మ” అంటూ ఘాటుగా స్పందించారు.
కేటీఆర్కి భవనాలు.. పేదలకి మాత్రం ఇళ్లు వద్దా ?
పొంగులేటి మాట్లాడుతూ కేటీఆర్పై తీవ్రంగా మండిపడ్డారు. “మీరు హైదరాబాద్లో పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారు. కానీ పేదవాడి కోసం ఒక్క ఇల్లైనా కట్టారా?” అంటూ ప్రశ్నించారు. పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులను బీఆర్ఎస్ నాయకులు అర్థం చేసుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేదల ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టిందని ఆయన తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లతో కాంగ్రెస్ చిత్తశుద్ధి తెలుస్తోంది
ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదలకు నిజమైన మద్దతు అందించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో అనేక వాగ్దానాలు చేసి అమలు చేయలేదని విమర్శించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు గట్టిగా పనిచేస్తోందని చెప్పారు. పేదల సంక్షేమమే తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమన్నారు.
Read Also : Ram Charan : సందీప్ వంగాతో రామ్ చరణ్ మూవీ?