📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Today News : Politics – జగన్ మోడీకి దత్తపుత్రుడు, అందుకే సిబిఐ గొంతు నొక్కేస్తున్నారు – షర్మిల

Author Icon By Shravan
Updated: August 30, 2025 • 11:01 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ Politics : జగన్ మోదీకి దత్తపుత్రుడని అందుకే సీబీఐ (CBI) ఆయన విషయంలో మెతక వైఖరిని ప్రదర్శిస్తుందని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. మోదీ చేతిలో సీబీఐ కీలు బొమ్మ అని.. జగన్ కోసం మోదీ సీబీఐ గొంతు నొక్కారని అన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపైసంచలన కామెంట్స్ చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె.. వివేకా హత్య విషయంలో మళ్లీ దర్యాప్తు ఎందుకు చేపట్టవద్దని ప్రశ్నించారు. వై నాట్? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒకటే పోరాటం అని.. ఇంత వరకు న్యాయం జరుగలేదన్నారు. సునీత పోరాటంలో న్యాయం ఉందన్నారు. జగన్ కోసం అవినాష్ రెడ్డిని కూడా కాపాడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. నిజంగా సీబీఐ అనుకుంటే ఎప్పుడో దోషులకు శిక్ష పడేదన్నారు. వివేకా హత్య కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయని.. గూగుల్ మ్యాప్ లొకేషన్లు కూడా ఉన్నాయని షర్మిల పేర్కొన్నారు. వైఎస్ వివేకా హత్య జరిగినప్పుడు అవినాష్ రెడ్డి సంఘటనా స్థలంలో ఉన్నాడని.. ఇందుకు సంబంధించి సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని షర్మిల తెలిపారు. ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ.. న్యాయం ఎందుకు జరుగడం లేదని ప్రశ్నించారామె.

జగన్ మోడీకి దత్తపుత్రుడు, అందుకే సిబిఐ గొంతు నొక్కేస్తున్నారు

బిజెపి, మిత్రపక్షాలపై తీవ్ర విమర్శలు – మైనార్టీల హక్కులపై ఆందోళన

సీబీఐ విచారణ సరిగా లేదంటూ సునీత చేసిన ఆరోపణల్లో నిజముందన్నారు. మైనార్టీల హక్కుల పట్ల కేంద్రంలోని బిజెపి (BJP) ప్రభుత్వానికి విలువ లేదన్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల మధ్య చిచ్చుపెట్టడమే బిజెపి సిద్ధాంతమన్నారు. ఆ చిచ్చులో చలి కాచుకొంటుందన్నారు. సిఎఎ, వక్స్ బిల్లు సవరణ, ఆర్టికల్ 370, అయోధ్య రామమందిరం వంటి వివాదాలతో ముస్లింల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారన్నారు. రాష్ట్రంలో టిపిడి, వైసిపి, జనసేన మూడు బిజెపి పార్టీలేనన్నారు. టిడిపి, జనసేన బహిరంగ పొత్తులో ఉంటే, వైసిపి అధినేత జగన్ది అక్రమ పొత్తుగా పేర్కొన్నారు. సెక్యులర్ పార్టీల ముసుగులో మైనార్టీలను టిడిపి, వైసిపిలు మోసం చేస్తున్నాయని తెలిపారు. మైనార్టీల ప్రయోజనాలు దెబ్బతినే అన్ని బిల్లులకు ఈ పార్టీలు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూమైనార్టీ ద్రోహులేనన్నారు. 45, 50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తామని చెప్పారన్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/temple-extensive-arrangements-made-to-ensure-that-devotees/andhra-pradesh/538119/?_thumbnail_id=538124

AP Congress BJP Congress news Breaking News in Telugu CBI investigations Latest News in Telugu Narendra Modi opposition criticism Telugu News Paper YS Jagan Mohan Reddy ys sharmila

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.