ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం, కేంద్రంతో కలిసి అమలు చేస్తున్న ప్రధానమంత్రి మాతృ వందన యోజన (PMMVY Scheme) గర్భిణీ స్త్రీలు, బాలింతలకు ఆర్థిక సహాయం, పోషకాహారం, మరియు ఆరోగ్య పర్యవేక్షణను అందించే ముఖ్యమైన పథకం. రాష్ట్రంలో మొదటి సారి గర్భం దాల్చిన వారికి ₹5,000, రెండో సారి ఆడపిల్ల పుట్టినట్లయితే ₹6,000 ఆర్థిక సహాయం ఇస్తున్నారు. తల్లి, శిశువు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం.
గతంలో మూడు విడతల్లో ఇచ్చిన ఈ సహాయాన్ని ఇప్పుడు రెండు విడతల్లో అందిస్తున్నారు. గర్భం దాల్చిన వెంటనే నమోదు చేసుకుంటే ₹3,000 ప్రసవం అనంతరం బిడ్డకు మూడు టీకాలు వేసిన తర్వాత మిగిలిన ₹2,000 అందుతాయి. రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే టీకాలు పూర్తవ్వగానే ₹6,000 ఒకేసారి చెల్లిస్తారు. ఈ ఆర్థిక సాయం తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించడమే కాకుండా ఆడబిడ్డ సంరక్షణకు కూడా తోడ్పడుతుంది.
Read also: హెచ్పీలో భారీ లేఆఫ్లకు రంగం సిద్ధం

పథకం అమలులో సవాళ్లు, పరిష్కారాలు
గర్భిణీల (PMMVY Scheme) ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, వారికి కావలసిన పోషకాహారం, వైద్య పర్యవేక్షణను ప్రభుత్వం అందిస్తోంది. అయితే పథకం నమోదు ప్రక్రియలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. అంగన్వాడీ కార్యకర్తలపై అదనపు పని భారం పెరగడం, కొన్ని చోట్ల నమోదు ప్రక్రియ సరిగా జరగకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా, ఆధార్–బ్యాంకు ఖాతా లింకింగ్ సమస్యల కారణంగా కొన్ని గర్భిణులకు గతంలో సాయం అందలేదు.
ఇప్పుడైతే, ఈ లోపాలను అధిగమిస్తూ, జూన్ నెల నుండి నమోదైన ప్రతి అర్హురాలికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసింది. గర్భిణులు, బాలింతలు ఈ పథకాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సరైన అవగాహన, సమర్థవంతమైన అమలు ఉంటే ఈ పథకం మరింత మందికి ఉపయోగపడుతుంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :