📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు

Today News : Pension Funds – రూ. 2,746.52 కోట్ల భరోసా పెన్షన్ నిధులు విడుదల – మంత్రి కొండపల్లి శ్రీనివాస్

Author Icon By Shravan
Updated: September 1, 2025 • 10:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ Pension Funds : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీర్ భరోసా పెన్షన్ పథకం (NTR Bharosa Pension Scheme) కింద సెప్టెంబర్ ఒకటవ తేదీన 63,61,380 మంది లబ్దిదారులకు పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేసేందుకు రూ. 2,746.52 కోట్లు గ్రామ, వార్డు సచివాలయాలకు విడుదల చేసిందని రాష్ట్ర సూక్ష్మ,, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొత్తగా మంజూరైన 7,872 మంది స్పౌజ్ పెన్షన్ లబ్దిదారులకు సెప్టెంబర్ 1న పెన్షన్ పంపిణీ చేయడానికి రూ. 3.15 కోట్లు కూడా విడుదలచేశామని మంత్రి చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి పింఛన్ల కోసం రూ. 32,143 కోట్లు బడ్జెట్ కేటాయించగా, ఇందులో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2025 వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ల పంపిణీకి రూ. 16,366.80 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా పెన్షన్ కోసం రూ. 10,000 కోట్లకు మించి కేటాయించడం లేదని తెలియజేశారు. పెన్షన్ పంపిణీ ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండేలా, లబ్దిదారుల ఇంటి వద్దే పెన్షన్ అందించడం తోపాటు వారి జియో కోఆర్డినేట్స్ ను కూడా నమోదు చేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి (Chief Minister) నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమా నికి, అభివృద్ధికి కట్టుబడి ఉందని, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు వంటి నిరుపేద, నిస్సహాయ వర్గాల కష్టాలను తొలగించడానికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని ఒక ముఖ్యమైన సంక్షేమ పథకంగా అమలు చేస్తోందని అన్నారు. దేశంలో సామాజిక భద్రతా పెన్షన్ కోసం అత్యధిక మొత్తాన్ని ఖర్చు చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమేనని మంత్రి శ్రీనివాస్ తెలియజేశారు.

మంత్రి కొండపల్లి శ్రీనివాస్

సెప్టెంబర్ నెలకు పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య ఎంత?

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద ఈ నెలలో 63,61,380 మంది లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయబడింది. అదనంగా కొత్తగా మంజూరైన 7,872 మంది స్పౌజ్ పెన్షన్ లబ్ధిదారులు కూడా ఈ జాబితాలో చేరారు.

ఈ ఆర్థిక సంవత్సరానికి పెన్షన్ల కోసం ఎంత బడ్జెట్ కేటాయించారు?

2025-26 ఆర్థిక సంవత్సరానికి పెన్షన్ల కోసం రూ. 32,143 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఇందులో ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు రూ. 16,366.80 కోట్లు విడుదలయ్యాయి.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/railway-board-railway-board-chairman-satish-kumars-tenure-extended-by-one-year/national/539153/

Andhra Pradesh pensions Bharosa Pension Breaking News in Telugu Kondapalli Srinivas Latest News in Telugu Pension Funds pension scheme Telugu News Paper welfare schemes AP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.