ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణంలో తారస్థాయికి చేరిన విమర్శలు మరింత ముదురుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరును తీవ్రంగా ఆక్షేపించారు. పరామర్శల (Consultations) పేరిట అస్థిరతకు ప్రోత్సాహం ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.
సుపరిపాలన కార్యక్రమంలో పాల్గొన్న పయ్యావుల
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం మోపిడి గ్రామంలో నిర్వహించిన ‘సుపరిపాలనలో తొలి అడుగు‘ కార్యక్రమంలో మంత్రి పయ్యావుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “గత ప్రభుత్వం ఉద్యోగుల నుంచి పాఠశాల పిల్లల భోజనాల వరకు బకాయిలు పెట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో ఆ వ్యవస్థను గాడిన పెట్టి, ప్రజలకు ప్రశాంతత, అభివృద్ధి, భరోసా ఇచ్చే పాలన (Reassuring governance) అందిస్తున్నాం” అని తెలిపారు.
జగన్ తీరుపై తీవ్ర విమర్శలు
పయ్యావుల ఆరోపించారంటే, జగన్ పరామర్శ పర్యటనలు అసలు దిశగా నడవడం లేదు. వాటి వెనుక రాజకీయ ఉద్దేశాలున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అభివృద్ధిని అడ్డుకునేలా జగన్ వ్యవహరిస్తున్నారని పయ్యావుల (Payyavula Keshav) మండిపడ్డారు. “పరామర్శల పేరుతో పర్యటిస్తూ, అసాంఘిక శక్తులను పెంచి పోషిస్తున్నారు. ‘రప్ప రప్ప’ నరుకుతామంటే మంచిదేగా అని వారిని వెనకేసుకొస్తున్నారు. ఆయన తీరు సమాజానికి ప్రమాదకరం” అని వ్యాఖ్యానించారు. జగన్ పోకడల పట్ల సమాజంలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన ప్రజలకు సూచించారు.
ఇంటింటి ప్రచారం – ప్రజల్లోకి పాలన
ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి పయ్యావుల ఇంటింటికీ తిరుగుతూ, కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Chandrababu: పింగళి వెంకయ్య, స్వామి వివేకానంద వర్ధంతి: సీఎం చంద్రబాబు, లోకేశ్ నివాళులు