ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రజల సమస్యలు వినేందుకు ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. భద్రతా కారణాలు, అభిమానుల రద్దీ వంటి సవాళ్ల కారణంగా నేరుగా ప్రజలను కలవడం సాధ్యపడకపోయినా, సమస్యలు తెలుసుకోవడంలో వెనుకడుగు వేయకుండా ‘మన ఊరికోసం మాటామంతీ’ అనే స్క్రీన్ గ్రీవెన్స్ కార్యక్రమం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు ప్రత్యక్షంగా తానిని కలవకుండానే తమ సమస్యలను వివరించవచ్చు.
మంగళగిరి నుండి ఈ కార్యక్రమం ప్రారంభం
ఈ కార్యక్రమం రేపు ఉదయం 9 గంటలకు మంగళగిరి నుంచి ప్రారంభం కానుంది. తొలి విడతలో పవన్ కళ్యాణ్, శ్రీకాకుళం జిల్లా రావివలసలో ఉన్న భవానీ థియేటర్కు వచ్చే ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. ఈ విధంగా పలు గ్రామాలకు సంబంధించిన ప్రజల బాధలను, అభిప్రాయాలను స్వయంగా వినడమే కాకుండా, వాటి పరిష్కారానికి అధికారులతో చర్చిస్తారు.
సమస్యల పరిష్కారం
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు కూడా పాల్గొననున్నారు. వారు ప్రజలు చెప్తున్న సమస్యలను నోటుచేసుకుని పరిష్కార చర్యలు చేపడతారు. ఈ కొత్త ప్రయత్నం ద్వారా ప్రజలతో పాలకుల మధ్య సంబంధం బలపడే అవకాశం ఉందని, సమస్యలు వేగంగా పరిష్కారమవుతాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ‘మన ఊరికోసం మాటామంతీ’ (Manavoorikosam Matamanthi) ప్రజల వేదికగా నిలిచే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి.
Read Also : Pawan Kalyan : పటాన్చెరు వెళ్లిన పవన్ కల్యాణ్ : ఎందుకంటే?